తల్లీ లేదు.. చెల్లీ లేదు.. ఎవరైనా సరే, వైసీపీ నాయకుల దృష్టిలో అవమానాలు పడాల్సిందే.. వైసీపీ నాయకులతో అవమనింపబడాల్సిందే.. ఇదీ వైసీపీ రాజకీయ సిద్ధాంతం. విజయమ్మ అయినా, వైఎస్ షర్మిల అయినా.. నిస్సందేహంగా, నిస్సిగ్గుగా.. వైసీపీ నేతలు దిగజారుడుతనం ప్రదర్శిస్తుంటారు.
వైఎస్ షర్మిల మీద గతంలో వైసీపీ నేతలు చేసిన విమర్శలు అత్యంత హేయం. విజయమ్మని సైతం వైసీపీ నేతలు తూలనాడారు. జగన్ తల్లి విజయమ్మ.. జగన్ సోదరి విజయమ్మ.. అయినా, వైసీపీ నేతలు వారిని బూతులు తిట్టడంలో అస్సలు తగ్గేదే లే.. అంటారు. పోనీ, వారిని జగన్ కంట్రోల్ చేస్తారా.? అంటే, అదీ లేదు.
కన్న తల్లినీ, తోడబుట్టిన చెల్లినీ.. ఈ విషయంలో వైఎస్ జగన్ కాపాడుకోలేకపోయారు.. వైసీపీ నేతల నుంచి. వారలా తిడుతోంటే, వారిని ఏనాడూ వైఎస్ జగన్ వారించిన దాఖలాలే లేవు.
వైఎస్ జగన్ ఇంట్లోని మహిళల పట్ల నీఛమైన వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల్లోని మహిళల్ని ఇంకెంత హేయంగా చూస్తారు.? వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలూ అలాంటివే.
చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులు సమర్థించుకోవడం కొత్త కాదు. పైగా, తమ మీద తామే తమ గూండాలతో దాడులు చేయించుకుని, కొత్త నాటకాలు ఆడటంలో సిద్ధహస్తులు కూడా. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దాడుల డ్రామాని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహా టీడీపీ నేతలు బయటపెట్టారు. దాంతో, వైసీపీ ఒక్కసారిగా అవాక్కయ్యింది.
ఓ కోడి కొత్తి డ్రామా.. ఓ గులక రాయి డ్రామా.. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద దాడి వ్యవహారం కూడా అలాంటి డ్రామానే. కూటమి ప్రభుత్వం, కూటమిలోని ఓ మహిళా నేతపై వైసీపీ నేత చేసిన అభ్యంతకర వ్యాఖ్యల నేపథ్యంలో, కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వుంది
