Switch to English

తిరుమలలో డిక్లరేషన్ అందరికీ.! వైసీపీ వితండవాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,153FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో బాప్టిజం తీసుకున్నానని చెప్పారట.. అలాగని వైసీపీ తెగ ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ తిరుమల వెళితే, డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందేనన్నది వైసీపీ డిమాండ్.

హోంమంత్రి వంగలపూడి అనిత విషయంలోనూ వైసీపీ ఇదే వాదన వినిపిస్తోంది. ఆ మాటకొస్తే చాలామంది కూటమి నేతల మీద ఈ తరహా డిమాండ్లు పెడుతోంది వైసీపీ. ఇలా చేయడం ద్వారా అసలు వైసీపీ సాధించేది ఏముంటుంది.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలన్నదానికి స్పష్టమైన అంశాలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అనీ, తాను బాప్టిజం తీసుకున్నాకే ఆయన్ని పెళ్ళి చేసుకున్నానని స్వయానా వైఎస్ విజయమ్మ, తాను రాసుకున్న పుస్తకంలో పేర్కొన్నారు.

సో, ఇక్కడ మేటర్ క్లియర్.. వైఎస్ జగన్, పుట్టిందే క్రిస్టియన్‌గా.! సో, ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. డిక్లరేషన్ అంటే, అదేమంత ప్రమాదకరమైనది కాదు కదా.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం వుందని ప్రకటించడమే.! విశ్వాసం లేకపోతే, డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు.. అసలు తిరుమలకి వెళ్ళకూడదు కూడా.!

పవన్ కళ్యాణ్ విషయంలో, ఇంకొకరి విషయంలోనో.. ‘అన్యమతం’ అన్న ప్రస్తావన లేదు. చట్ట ప్రకారం, వాళ్ళంతా హిందువులే గనుక. నిజానికి, చాలామంది ప్రజా ప్రతినిథులు క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు. అయినాగానీ, వాళ్ళలో చాలామంది దళిత కోటాలో రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

ఎప్పుడైతే చట్ట ప్రకారం మతం మారతారో, అప్పుడు రిజర్వేషన్ల వ్యవహారంలో మార్పులు, చేర్పులు వుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓ హిందువు, క్రిస్టియానిటీని గౌరవిస్తాడు, ఇస్లాంని కూడా గౌరవిస్తాడు. క్రిస్టియానిటీ, ఇస్లాంలో వ్యవహారాలు వేరేలా వుంటాయి. హిందూ దేవాలయాల్లోని ప్రసాదాల్ని వారు తినరు. విగ్రహారాధనను అస్సలు ఒప్పుకోరు. వారి ఆచారాలు అలా వుంటాయ్.. వారిని తప్పు పట్టడానికి లేదు.

కొన్ని దర్గాల్లో ఎక్కువగా హిందూ భక్తులే కనిపిస్తుంటారు. కొన్ని చర్చిలకు హిందువులు ఎక్కువగా వెళుతుంటారు కూడా. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నిజానికి, ఇలా మతాల గురించిన ప్రస్తావన అంటే.. సున్నితమైన అంశమని అనుకుంటాం, గంభీరమైన అంశం కూడా.

అందుకే, తొందరపడి రాజకీయ నాయకుల మీద, ‘డిక్లరేషన్’ విషయమై అనవసరమైన తేలిక కామెంట్లు చేసెయ్యడం సబబు కాదు. మరీ ముఖ్యంగా వైసీపీకి, ఇది ఏ రకంగానూ మంచిది కాదు. ఏ ఉద్దేశ్యంతో వైసీపీ ఈ డిక్లరేషన్ వ్యవహారంలో రాజకీయ నాయకుల మీద దుష్ప్రచారం షురూ చేసిందోగానీ, హిందూ ఓటు బ్యాంకు శాశ్వతంగా వైసీపీకి దూరమయిపోయేలా వుంది.

సింపుల్‌గా డిక్లరేషన్ మీద గనుక వైఎస్ జగన్ సంతకం చేసేసి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే.. వివాదం అక్కడితో సమసిపోయేదే.! యధా జగన్, తథా వైసీపీ క్యాడర్.. అన్నట్లు, వైసీపీ పతనాన్ని స్వయంగా వైసీపీలోనే అందరూ కోరుకుంటున్నట్టున్నారు.

సినిమా

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన...

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో...

రాజకీయం

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

వరద నీళ్ల పేరుతో దొంగ డ్రామాలా?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజల వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని వైసీపీ, బీఆర్ఎస్ కలిసి బురద రాజకీయాలు చేస్తున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా వరద జలాల విషయంలో రెండు...

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

ఎక్కువ చదివినవి

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

టాలీవుడ్‌కు మరో ఫన్ ఫుల్ కామెడీ.. రాజేంద్రప్రసాద్ విడుదల చేసిన ఆసక్తికర టైటిల్

టాలీవుడ్‌లో వినోదాత్మక సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉండగా, అదే బాటలో మరో ట్రెండీ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న...

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి మాటలతో స్పందించకుండానే, తన లేటెస్ట్‌ అప్డేట్స్‌తోనే...

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...