Switch to English

తిరుమలలో డిక్లరేషన్ అందరికీ.! వైసీపీ వితండవాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో బాప్టిజం తీసుకున్నానని చెప్పారట.. అలాగని వైసీపీ తెగ ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ తిరుమల వెళితే, డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందేనన్నది వైసీపీ డిమాండ్.

హోంమంత్రి వంగలపూడి అనిత విషయంలోనూ వైసీపీ ఇదే వాదన వినిపిస్తోంది. ఆ మాటకొస్తే చాలామంది కూటమి నేతల మీద ఈ తరహా డిమాండ్లు పెడుతోంది వైసీపీ. ఇలా చేయడం ద్వారా అసలు వైసీపీ సాధించేది ఏముంటుంది.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలన్నదానికి స్పష్టమైన అంశాలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అనీ, తాను బాప్టిజం తీసుకున్నాకే ఆయన్ని పెళ్ళి చేసుకున్నానని స్వయానా వైఎస్ విజయమ్మ, తాను రాసుకున్న పుస్తకంలో పేర్కొన్నారు.

సో, ఇక్కడ మేటర్ క్లియర్.. వైఎస్ జగన్, పుట్టిందే క్రిస్టియన్‌గా.! సో, ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. డిక్లరేషన్ అంటే, అదేమంత ప్రమాదకరమైనది కాదు కదా.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం వుందని ప్రకటించడమే.! విశ్వాసం లేకపోతే, డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు.. అసలు తిరుమలకి వెళ్ళకూడదు కూడా.!

పవన్ కళ్యాణ్ విషయంలో, ఇంకొకరి విషయంలోనో.. ‘అన్యమతం’ అన్న ప్రస్తావన లేదు. చట్ట ప్రకారం, వాళ్ళంతా హిందువులే గనుక. నిజానికి, చాలామంది ప్రజా ప్రతినిథులు క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు. అయినాగానీ, వాళ్ళలో చాలామంది దళిత కోటాలో రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

ఎప్పుడైతే చట్ట ప్రకారం మతం మారతారో, అప్పుడు రిజర్వేషన్ల వ్యవహారంలో మార్పులు, చేర్పులు వుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓ హిందువు, క్రిస్టియానిటీని గౌరవిస్తాడు, ఇస్లాంని కూడా గౌరవిస్తాడు. క్రిస్టియానిటీ, ఇస్లాంలో వ్యవహారాలు వేరేలా వుంటాయి. హిందూ దేవాలయాల్లోని ప్రసాదాల్ని వారు తినరు. విగ్రహారాధనను అస్సలు ఒప్పుకోరు. వారి ఆచారాలు అలా వుంటాయ్.. వారిని తప్పు పట్టడానికి లేదు.

కొన్ని దర్గాల్లో ఎక్కువగా హిందూ భక్తులే కనిపిస్తుంటారు. కొన్ని చర్చిలకు హిందువులు ఎక్కువగా వెళుతుంటారు కూడా. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నిజానికి, ఇలా మతాల గురించిన ప్రస్తావన అంటే.. సున్నితమైన అంశమని అనుకుంటాం, గంభీరమైన అంశం కూడా.

అందుకే, తొందరపడి రాజకీయ నాయకుల మీద, ‘డిక్లరేషన్’ విషయమై అనవసరమైన తేలిక కామెంట్లు చేసెయ్యడం సబబు కాదు. మరీ ముఖ్యంగా వైసీపీకి, ఇది ఏ రకంగానూ మంచిది కాదు. ఏ ఉద్దేశ్యంతో వైసీపీ ఈ డిక్లరేషన్ వ్యవహారంలో రాజకీయ నాయకుల మీద దుష్ప్రచారం షురూ చేసిందోగానీ, హిందూ ఓటు బ్యాంకు శాశ్వతంగా వైసీపీకి దూరమయిపోయేలా వుంది.

సింపుల్‌గా డిక్లరేషన్ మీద గనుక వైఎస్ జగన్ సంతకం చేసేసి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే.. వివాదం అక్కడితో సమసిపోయేదే.! యధా జగన్, తథా వైసీపీ క్యాడర్.. అన్నట్లు, వైసీపీ పతనాన్ని స్వయంగా వైసీపీలోనే అందరూ కోరుకుంటున్నట్టున్నారు.

సినిమా

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి...

రాజకీయం

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్,...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు...