Switch to English

పాపం వైసీపీ.! చంద్రబాబు – పవన్ కలయికతో ఏడుపొక్కటే తక్కువ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం పెట్టకున్నారట.! టీడీపీ – జనసేన మధ్య పొత్తు పెటాకులయ్యే అవకాశం.! ఇరు పార్టీల మధ్యా భగ్గుమంటున్న విభేదాలు.. ఇలా సాగింది వైసీపీ దుష్ప్రచారం.!

కట్ చేస్తే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సరదాగా ముచ్చట్లాడుకున్నారు. ఎన్టీయార్ ట్రస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేశారు. కార్యక్రమం టీడీపీ అనుబంధ సంస్థ లాంటిదైన ఎన్టీయార్ ట్రస్ట్‌ది కావడంతో, చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇదే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం అందింది. మిత్రపక్షాలు కదా.. టీడీపీ – జనసేనకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమిలో మరో మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తలసీమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమిది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. సరదా సంభాషణలు జరుపుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి, వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నాయి.

అదేంటీ, టీడీపీ – జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు తమ పార్టీ వైసీపీ ప్రయత్నించింది కదా.? రెండు పార్టీలూ విడిపోయాయని వైసీపీనే దుష్ప్రచారం చేసింది కదా.? ఇదేంటిలా జరిగింది.? అని వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోతున్నాయి. సాక్షి మీడియాని నమ్మితే, ఇలాగే నట్టేట్లో మునగాల్సి వస్తుందని వైసీపీ క్యాడర్.. అందునా, వైసీపీ సోషల్ మీడియా కూలీలు ఇంకోసారి లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది.

కనీసం పదేళ్ళ పాటు టీడీపీ – జనసేన – బీజేపీ కలిసే వుంటాయనీ, వుండాలనీ ప్రతిసారీ చెబుతూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెబుతున్న సంగతి తెలిసిందే.

వైసీపీ సానుభూతిపరులుగా మారుతున్న కొందరు టీడీపీ అభిమానులు, టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడ్డ కొన్ని మీడియా సంస్థలు.. టీడీపీ – జనసేన కలిసి వుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నమాట వాస్తవం.

అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్న చిన్న అభిప్రాయ బేధాల్ని ఇరు పార్టీలూ ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నాయి. అధినేతల స్థాయిలో ఎలాంటి పొరపచ్చాలకూ అవకాశం లేకుండా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

అలాంటప్పుడు టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ వచ్చే పరిస్థితి ఎందుకు వుంటుంది.?

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 మార్చి 2025

పంచాంగం తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...