వైఎస్ జగన్ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు పెట్టడం అనేది సర్వసాధారణం. తమ నిర్ణయాలపై న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినప్పుడు, తప్పుల్ని సరిదిద్దుకోవడం ప్రభుత్వాల బాధ్యత. అయితే, తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు చేయడమే ఇక్కడ అసలు సమస్య. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం కావొచ్చు.. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారాలు కావొచ్చు.. ఇక్కడ బేషజాలు అనవసరం.
ప్రభుత్వం అనేది ప్రజల కోసం. అంతే తప్ప పెత్తనం కోసం కానే కాదు. పెత్తనం కోణంలో ఆలోచిస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. ఇక, వాస్తవాల్ని పక్కన పెట్టి.. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో నానా యాగీ చేసేస్తున్నారు. కొందరైతే కోర్టులకూ దురుద్దేశ్యాలు ఆపాదించేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్లు, పీపీఈ కిట్లను అడిగిన డాక్టర్పై విషం చిమ్మారు.. కరోనా వైరస్ ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని రక్షించే క్రమంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ‘కులం’ ఆపాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే.
ఇవి చాలక, ఇప్పుడు న్యాయస్థానాల మీద పడుతున్నారు వైసీపీ మద్దతుదారులు. చంద్రబాబుకి న్యాయస్థానాల్ని మేనేజ్ చేయడం బాగా తెలుసనీ, ఈ క్రమంలోనే పదే పదే జగన్ సర్కార్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణ. సరే, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థుడా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఏ వ్యవస్థనీ విడిచిపెట్టకుండా.. అన్ని వ్యవస్థల మీదా అధికార పార్టీకి చెందిన నేతలు కావొచ్చు, మద్దతుదారులు కావొచ్చు బురదజల్లడం ఎంతవరకు సమంజసం.?
863838 525586Any way Ill be subscribing to your feed and I hope you post once more soon. I dont think I could have put it far better myself. 349163
457001 818349Thank you, Ive just been looking for data about this subject for a whilst and yours could be the greatest Ive discovered till now. But, what in regards to the conclusion? Are you certain concerning the supply? 749062