ఆయనెవరో జర్నలిస్టు అట.! ఆయన సాక్షిలో ఏదో మాట్లాడితే వైసీపీకి ఏంటి సంబంధమట.? ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వేశ్యల రాజధాని అమరావతి’ వివాదంపై స్పందించిన తీరు.
సాక్షి మీడియా ఎవరిది.? అసలు, ఆ జర్నలిస్టు ఎవరు.? ఛానెల్లో డిబేట్ నడిపిస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎవరు.? ఏ పార్టీకి చెందిన వ్యక్తి.? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో సీనియర్ జర్నలిస్టు ఎవరు.? ఏ పార్టీకి చెందిన వ్యక్తి.?
డిబేట్ నిర్వహించింది సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. నిజానికి, జర్నలిస్టులంటే పార్టీలకు అతీతంగా పని చేయాలి. కానీ, వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవి తీసుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన వైసీపీ కార్యకర్తే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఇక, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో సీనియర్ జర్నలిస్టు పేరు కృష్ణం రాజు. ఈయన కూడా వైసీపీ కార్యకర్తే.! ఆయన ఏ డిబేట్లో పాల్గొన్నా వైసీపీకి అనుకూలంగానే మాట్లాడతారు. వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవి కోసం ఈయనా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించి వుంటే, అధికారికంగా ఈయనా వైసీపీ కార్యకర్త అయి వుండేవారు.
ఇక, సాక్షి ఛానల్.. అందరికీ తెలిసిందే, అది వైసీపీ ఛానల్. వైసీపీ ఛానల్లో వైసీపీ జర్నలిస్టు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మరో వైసీపీ జర్నలిస్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలు సదరు వ్యక్తి వ్యక్తగతమంటూ వైసీపీ బుకాయిస్తోంది.
వాస్తవానికి, అమరావతి మీద వైసీపీ విషం చిమ్మడం ఇదే తొలి సారి కాదు. వైసీపీ హయాంలో అమరావతి మహిళల్ని, ‘కూకట్పల్లి ఆంటీలు..’ అంటూ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు, అందులో మంత్రులుగా పని చేసినవారూ వున్నారు.
అసభ్యకరం.. అత్యంత అసభ్యకరమైన రీతిలో, అమరావతి మహిళలపై ‘చీప్’ కామెంట్స్ వైసీపీ నాయకులు చేసిన సందర్భాలు కోకొల్లలు. అమరావతి మీద అక్కసుతో, పోలీసుల్ని అమరావతి మహిళలపైకి ఉసిగొల్పి, అత్యంత కిరాతకంగా వారిని హింసించిన సందర్భాలు వైసీపీ హయాంలో బోలెడు.
‘చంద్రబాబేమో అమరావతిని దేవతల రాజధాని అంటున్నారు.. కానీ, అది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారింది..’ అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి డిబేట్లో చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. పదుల సంఖ్యలో వుండే సెక్స్ వర్కర్ల డేటాతో, లక్షలాది మంది మహిళల్ని అవమానించాలన్న ఆలోచన, వైసీపీ అనే చెత్తని బుర్ర నిండా నింపుకోగలిగాడు కాబట్టే వచ్చింది జర్నలిస్టు కృష్ణంరాజుకి.
