వైఎస్సార్ సీపీలో ధిక్కార స్వరం వినిపిస్తూ.. సీఎం జగన్ పై మాత్రం అభిమానం కనబరుస్తూ.. సమయం ఇస్తే అన్నీ వివరిస్తానని అభ్యర్థిస్తూ.. బీజేపీపై సాప్ట్ కార్నర్ కనబరుస్తూ.. ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపిస్తూ.. అసలు తన మదిలో ఏముందో బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పై ఏపీ అధికార పార్టీ ఏం చర్యలు తీసుకోబోతోంది? ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేక అనర్హత వేటు వేయిస్తారా? ఇదీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ.
అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ వైసీపీ నేత అందించిన సమాచారం ప్రకారం, పార్టీకి నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు ఏకంగా పార్టీ గుర్తింపును ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజుపై అధిష్టానం ఒకింత ఆగ్రహంగానే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న శరద్ యాదవ్ పై రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఇదే విధంగా రాజుపై కూడా వేటు వేయించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, ఇది ఎంతవరకు సఫలమవుతుందో అనేదానిపై చర్చిస్తున్నారట . శరద్ యాదవ్ విపక్షాల ర్యాలీల్లో పాల్గొన్నారనే ఆధారాలు ఉండటంతోపాటు బీజేపీ కూడా అందుకు అనుకూలంగా ఉండటంతో వెంటనే వేటు పడింది. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు.
ఈ నేపథ్యంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న వైసీపీ.. రఘురామకృష్ణరాజు వ్యవహారం తేల్చాల్సిందిగా మచిలీపట్నం ఎంపీ బాలసౌరితోపాటు మరో ఎంపీని ఢిల్లీ పంపినట్టు చెబుతున్నారు. వారిద్దరూ లోక్ సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులతో భేటీ అయి తమ వాదన వినిపించినట్టు సమాచారం. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే వైసీపీ తన తదుపరి కార్యాచణ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది చర్చనీయాంశమైంది.
వాస్తవానికి వైసీపీకి బీజేపీ పెద్దలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. రెండు పార్టీలూ పరస్పర ప్రయోజన ప్రాతిపదికనే ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే పరిమళ్ నత్వానీకి బీజేపీ సిఫార్సుపై రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇక బీజేపీకి రఘురామరాజు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. లోక్ సభలో అవసరమైనదాని కంటే ఎక్కువ మెజార్టీ ఉన్నందున రాజు వల్ల వారికి ఒరిగేదేమి లేదు. వైసీపీ బహిష్కరిస్తే మేం ఆశ్రయం ఇస్తామని బీజేపీ నుంచి భరోసా వచ్చిందని సమాచారం. అయితే, వైసీపీ వేటు వేయకుండా ఉంటే మాత్రం తీసుకునేది లేదని తెగేసి చెప్పారట.
పైగా ఆయన చైర్మన్ గా ఉన్న స్టాండింగ్ కమిటీ పదవీకాలం అక్టోబర్ 8తో ముగియనుంది. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎలాగూ ఇచ్చే చాన్స్ లేదు. అదే బీజేపీలో చేరితే తన పరిచయాల ద్వారా మళ్లీ అలాంటి పదవి పొందే అవకాశం ఉందని, అందుకే తనపై సస్పెన్షన్ వేటు వేయించుకుని బీజేపీలో చేరాలనే యోచనతోనే కొంతకాలంగా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇప్పటివరకు ఆయన విషయాన్ని పార్టీ అధిష్టాన పెద్దలు అంతగా పట్టించుకోకుండా వదిలేశారని, కానీ ఏకంగా పార్టీ గుర్తింపునే ప్రశ్నించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై వేటు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇక బీజేపీకి లోక్ సభ కంటే రాజ్యసభలోనే మద్దతు అవసరం. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యులున్నారు. మరో రెండేళ్ల తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతగా ఉపయోగం లేని రఘురామకృష్ణ రాజు కోసం వైసీపీతో తగాదా పెట్టుకునే పనిని కమలనాథులు చేయరనే చెబుతున్నారు . మొత్తానికి రఘురాముడి భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉంది.
917001 30369Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on many occasions. pays day-to-day 90846
843737 689269Your talent is genuinely appreciated!! Thank you. You saved me a lot of frustration. I switched from Joomla to Drupal to the WordPress platform and Ive fully embraced WordPress. Its so a lot easier and easier to tweak. Anyway, thanks again. Awesome domain! 194163
927600 416573As I website owner I believe the content material material here is extremely superb, thanks for your efforts. 530278
381324 835773The very good intreguing articles keep me coming back here time and time once more. thank you so significantly. 534323
909423 737147you use a amazing weblog here! do you wish to have the invite posts in my small blog? 12659
720744 761668Yeah bookmaking this wasnt a bad decision excellent post! . 193437