సబ్బు బిళ్ళా.. అగ్గి పుల్లా.. కుక్క పిల్లా.. కాదేదీ కవితకనర్హం అని ఓ మహా కవి అన్నాడు. ఆ సంగతేమోగానీ, రాజకీయ పార్టీలు ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటుంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ తరహా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా కన్పించేది. ఈ విషయంలో టీడీపీని ఎప్పుడో దాటేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ హయాంలో రంగుల పిచ్చి ఎంతగా రాజ్యమేలిందో చూశాం.. ఇప్పుడు వైసీపీ రంగుల పిచ్చి గురించి చూస్తున్నాం.
హైకోర్టు చీవాట్లు పెడితే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన అధికార పార్టీ, అక్కడా చీవాట్లు తిన్నాక కూడా బుద్ధి తెచ్చుకున్నట్లు లేదు. స్థానిక ఎన్నికలు కరోనా మహమ్మారి కారణంగా ఆగితే, కరోనా కమ్మేస్తున్నా.. అధికార పార్టీ పబ్లిసిటీ స్టంట్లు ఆపకపోవడం గమనార్హం. వైసీపీ జెండా రంగులతో ఫేస్ మాస్కులు చూశాం.. ఇప్పుడు వైసీపీ జెండా రంగులతో కరోనా బాధితులకు ‘కిట్లు’ వెళుతున్నాయి.. అదీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది అధికార పార్టీ నేతల తీరు.
కరోనా మహమ్మారి కారణం ఉపాధి కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా అభినందించాల్సిందే. అధికార పార్టీ నేతల్లోనూ కొందరు చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం.. ఇక్కడా పబ్లిసిటీని కోరుకుంటున్నారు. పైగా, ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అంటూ కరపత్రాలు కూడా పంచుతున్నారు.. నిత్యావసర వస్తువుల ప్యాకెట్లతోపాటు.
కరోనా విలయం నేపథ్యంలో ప్రజల్ని రోడ్ల మీదకు రాకుండా చేయడంలో తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయని పోలీసులు, ఈ ‘చెత్త’ రాజకీయాల వైపు చూడగలరా.? ‘ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలి..’ అని న్యాయస్థానాలు హెచ్చరించినా, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారాన్ని ‘కరోనా’ మాటున చేస్తున్నారంటే, వీళ్ళసలు మనుషులేనా.? అన్న అనుమానం కలగకమానదు. అయినా, స్మశానాలకు సైతం పార్టీ రంగులేసుకునే రాజకీయ నాయకుల నుంచి ‘విజ్ఞత’ని ఆశించడం హాస్యాస్పదం కాక మరేమిటి.!
741144 254734Jeden Tag stellt man sich die Frage Was Koche Ich Heute?! Zerbrechen Sie sich nicht den Kopf, besuchen Sie uns am besten direkt auf unserer Webseite uns lassen Sie sich inspirieren 154706
258600 566834You produced some decent points there. I looked on the internet for that dilemma and discovered many people is going together with with the internet site. 165881