Switch to English

హరియాణాలోనూ ఓడిపోయిన వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బెంగళూరుకే పరిమితమవుతుండడంతో వైసీపీ కార్యకర్తలకు ఏం పాలుపోని పరిస్థితి. తమిళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు.. వాట్ నాట్.. చివరికి హరియాణా రాజకీయాలపైనా ప్రత్యేక శ్రద్ధ కనబర్చడమే కాదు, ఆ పేరు చెప్పి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద షరామామూలుగా విమర్శలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు.

అసలు హరియాణా ఎన్నికలకీ, పవన్ కళ్యాణ్‌కీ ఏమైనా సంబంధం వుందా.? ఆ మాత్రం ఇంగితమే వుంటే, వాళ్ళు వైసీపీ కార్యకర్తలెందుకు అవుతారు.? రెండు మూడు రోజుల నుంచి హరియాణా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల విషయమై, ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. వాటిని పవన్ కళ్యాణ్‌కి లింకప్ చేస్తూ.. పనికిమాలిన రాతలతో, సోషల్ మీడియా అంతా రోత పుట్టించేస్తూ వచ్చారు వైసీపీ కార్యకర్తలు.

ఫలితాలు రానే వచ్చాయ్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న వైసీపీ కార్యకర్తలకు షాక్ తగిలింది. అటు కాశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ఖేల్ ఖతం అయిపోయింది. హరియాణాలోనూ పాపం కాంగ్రెస్ ఓడిపోయింది. దాంతో, తెల్లవారు ఝాము నుంచీ హంగామా చేసిన వైసీపీ కార్యకర్తలు, ఉదయం పది తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

అదేంటో, మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న దుస్థితే, ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలోనూ ఎదుర్కొనడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్నాగానీ.. ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో, వైసీపీ శ్రేణులు.. చెట్టుకొకరు, పుట్టకొకరు.. అన్నట్లు చెల్లాచెదురైపోతున్నారు.

వైసీపీకి ఒకప్పుడు బలమైన సోషల్ మీడియా టీమ్ వుండేది. అందులో చాలామంది ఇప్పటికే ఔట్ అయిపోయారు. మిగిలినోళ్ళు.. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి కంటెంట్ లేక, ఇతర రాష్ట్రాల్లో రాజకీయాల్లో వేలు పెట్టి, శునకానందం పొందుతున్నారు.. షాక్ ట్రీట్మెంట్లూ ఎదుర్కొనాల్సి వస్తోంది.

అయినా, కాంగ్రెస్ గెలిస్తే వైసీపీకి వచ్చే లాభమేంటి.? కాంగ్రెస్ కోసం ఎందుకింతలా వైసీపీ సోషల్ మీడియా టీమ్, స్పెషల్ డ్యూటీ చేస్తున్నట్లు.? విలీనంపై ఏమైనా స్పష్టమైన సంకేతాలు అధినాయకత్వం నుంచి వైసీపీ సోషల్ మీడియా టీమ్‌కి వచ్చాయని అనుకోవాలా.?

హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది.. ఈవీఎం గెలిచిందంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే కాదు, గత ఐదేళ్ళుగా వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచేసిన నీలి కూలి మీడియా కూడా నెత్తీ నోరూ బాదుకుంటుండడం కొసమెరుపు. ఇందులో నీలి ఎర్నలిస్టుల పైత్యం పతాక స్థాయికి చేరుకోవడం మరో ఆసక్తికర అంశం.

సినిమా

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

BIGG BOSS 9 TELUGU E86: ఎమోషన్‌తో పాటు అగ్నిలా మండిన నామినేషన్స్!

బిగ్ బాస్ సీజన్ 9 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఎమోషన్, అండ్ పక్కా మసాలాతో నిండిపోయింది. సాధారణ నామినేషన్స్ అనుకున్న ఇంటి సభ్యులు… ఈ వారం మాత్రం ఎవరు ఎవరిని నామినేట్...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

BIGG BOSS 9 TELUGU E89: తొలి ఫైనలిస్ట్ కోసం దుమ్ము రేపిన టాస్కులు, ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ సీజన్ 9 గురువారం ఎపిసోడ్ 89 లో  ఇంట్లో అల్లరి, ఆగ్రహం, డ్రామా, పోటీ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి. తొలి ఫైనలిస్ట్‌ కోసం జరిగిన ఛాలెంజ్‌లు సభ్యుల సామర్థ్యాన్నీ, సహనాన్నీ...

స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా...