వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నిరకాల ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, టిడిపికి మండలిలో మంచి పట్టు ఉన్నది. మరేమో రెండేళ్ల వరకు టీడీపీకి మండలిలో పట్టు ఉంటుంది. దీంతో కీలక బిల్లుల విషయంలో మండలి నుంచి ఇబ్బందులు వస్తున్న సందర్భంగా మండలిని రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టి ఆమోదిస్తే మండలి రద్దు అవుతుంది.
అయితే, ఇప్పుడు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభతో పాటుగా శాసన మండలిని కూడా ఆహ్వానిస్తారా లేదంటే శాసనసభను మాత్రమే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తారా అన్నది చూడాలి. మామూల అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్, కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ అని ఉంటుంది. అంటే ఏ సభకు ఆసభను వాయిదా వేసుకోవచ్చు, ఏ సభను ఆసభ సమావేశ పరుచుకోవచ్చు.
ఆ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఉభయసభలు హాజరు కావాల్సి ఉంటుంది. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడతారు. కానీ, ఇప్పుడు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి కాకుండా తన ప్రసంగంలో శాసనసభను మాత్రమే ఉద్దేశించి మాట్లాడేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే టీడీపీ ఇబ్బందుల్లో పడినట్టే అవుతుంది.
184843 411309hey there, your web site is low cost. We do thank you for function 987109
934461 506799Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting more than to WP. Also did you make this theme on your own? Thanks. 93444