నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఇంట్లోనే ఉన్నా: వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,235FansLike
57,764FollowersFollow

తిరుపతిలో నిన్నటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించట్లేదని పెద్ద రచ్చ జరుగుతోంది. ఎందుకంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు మంగళవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ సిపాయిని ఎవరో కిడ్నాప్ చేశారని.. కావాలనే కూటమి నేతలు ఇదంతా చేయిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇదే విషయం మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో నిజంగానే ఆయన కిడ్నాప్ కు గురయ్యారేమో అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చెక్ పెట్టారు.

తన ఇంట్లో నుంచి వీడియో రిలీజ్ చేశారు. తాను బాగానే ఉన్నానని.. ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. తనకు అనారోగ్యం కారణంగా బయటకు రావట్లేదని.. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఇంటివద్దనే ఉంటున్నట్టు తెలిపారు. కాబట్టి బయట జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. మీడియా, పోలీసులు ఈ విషయాన్ని గ్రహించాలంటూ ఆయన కోరారు. తన కిడ్నాప్ చుట్టూ రూమర్లు సృష్టించొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ వాళ్లే కావాలని ఈ ఫేక్ ప్రచారం చేశారంటూ స్థానిక కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

“జడ శ్రవణ్ గారు.. వారిని ఇవి కూడా అడగండి!”

మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

116 ఏళ్ల భక్తురాలి కోరిక తీర్చిన టీటీడీ.. ప్రత్యేక దర్శనంతో సత్కారం

భక్తి, సంకల్పం ముందు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి...

VBGRAMG ప్రారంభానికి తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే...