Switch to English

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,803FansLike
57,764FollowersFollow

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.?

ఈ ప్రశ్న సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నుంచి, అసెంబ్లీలోనే వచ్చింది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. కానీ, చిత్రంగా ఆ ఎమ్మెల్యేలు హాజరు పట్టీలో సంతకాలు చేస్తున్నారట. అదీ దొంగతనంగా అసెంబ్లీకి వస్తున్నారట. ఇదీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఉవాచ.

అయితే, వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, శాసన సభ్యులుగా తాము అసెంబ్లీకి వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెడుతున్నది, సభ ముందు కొన్ని ప్రశ్నలు ప్రజల తరఫున వుంచడానికి.. అంటూ సెలవిచ్చారు.

శాసన సభ్యుల్ని అవమానించేలా స్పీకర్ తీరు వుందన్నది వైసీపీ వాదన. అక్కడిదాకా వెళ్ళి, సంతకాలు పెట్టే వైసీపీ ఎమ్మెల్యేలు, గౌరవ ప్రదంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వొచ్చు కదా.! ఆ ప్రశ్నలేదో, తమకు కేటాయించిన సమయంలో ప్రభుత్వానికి వేయొచ్చు కదా.?

అసలు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళుతున్నారన్న విషయమే ఎవరికీ తెలియదు. ఇటీవల శాసన సభ్యుల గ్రూప్ ఫొటోలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సహా, వైసీపీ ఎమ్మెల్యేలెవరూ కనిపించలేదు. శాసన మండలి సభ్యుల గ్రూప్ ఫొటోలో మాత్రం, బొత్స సత్యనారాయణ సహా వైసీపీ శాసన మండలి సభ్యులంతా కనిపించారు.

ఒక్కటి మాత్రం నిజం.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. ఇంకోపక్క, శాసన సభ్యులకు గౌరవ వేతనాల్ని కూడా లక్షల్లో చెల్లిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.

అసలంటూ శాసన మండలి సమావేశాల వైపు చూసేందుకే ఇష్టపడని ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని గౌరవ వేతనం రూపంలో దోచిపెట్టాల్సిన అవసరం ఏముందన్నది సామాన్యుడి నుంచి వస్తున్న ప్రశ్న.

కేవలం, గౌరవ వేతనం మాత్రమే కాదు, ఇతరత్రా ప్రోటోకాల్స్ సహా అనేక వెసులుబాట్లు శాసన సభ్యులకు వుంటాయి. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మంచిది కదా.!

ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళి, తమ తమ నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు అసెంబ్లీలో పని చేస్తారో.. అలాంటి వారిని అసెంబ్లీకి పంపించే అవకాశం ఆయా నియోజకవర్గాల ప్రజలకు కలగాలంటే, వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందే.

లేదూ, ఇదే పద్ధతి ఇలాగే కొనసాగనివ్వడమంటే, దొంగచాటుగా హాజరు పట్టీలో సంతకాల వ్యవహారం సర్వసాధారణమైపోతుంది. తద్వారా విలువైన ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, బాధ్యతగల పదవిలో వుండి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సి వుంది.

అదే సమయంలో, ‘దొంగచాటుగా ఏమీ మేం వెళ్ళడంలేదు’ అంటూ బుకాయిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంటుంది. ప్రజాధనాన్ని అప్పనంగా బొక్కితే అది మంచిది కాదు.. అన్న విషయాన్ని గుర్తెరిగి, గౌరవంగా తమ పదవులకు రాజీనామా చేస్తే మంచిదేమో.

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 19 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 19-04-2025, శనివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ షష్ఠి మ. 1.55 వరకు,...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 21 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 21-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ అష్టమి మ. 1.49 వరకు,...

ఇదే అసలైన భారతీయ సంస్కృతి.. పవన్ కల్యాణ్‌ ట్వీట్..

భారతదేశ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్...

పవన్ కళ్యాణ్‌కి ఏమైంది.? అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చాలాకాలంగా ఆయన, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అలాగే,...