తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్ పదవి చాలామందికి ఓ కల. ఆ పదవి ఆశించేవారు ఎక్కువ.. వచ్చిన వారు మహాప్రసాదంగా పదవిని స్వీకరిస్తారు. కానీ.. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే తనకు ఆ పదవి వద్దని తిరస్కరించడం సంచలనం రేపుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడే ఈ పదవి తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
విశాఖ జిల్లా పాయకారావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు బుధవారం ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో అవకాశం కల్పించారు. నిజానికి రెండేళ్ల క్రితమే ఈయనకు ఈ పదవి వస్తుందని భావించినా దక్కలేదు. అప్పట్లో నిరాశ చెందిన బాబూరావుకు మలివిడతలో అవకాశం ఇవ్వగా.. ఇప్పుడాయన ఈ అవకాశాన్ని వద్దనుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.
2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడా సమయం వచ్చింది. మరో నెలలో మంత్రివర్గంలో మార్పులు ఖాయమన్న వార్తలు జోరందుకుంటున్నాయి. దీంతో బాబూరావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ పదవికి ఆయన పేరు ప్రకటించారంటే.. ఇక మంత్రి పదవి దక్కనట్టే. దీంతోనే ఆయన అలిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్ చేశారు. ‘నాకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి అవసరం లేదు’ అని తెగేసి చెప్పారట. పైగా.. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచారట. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చి జగన్ కు తోడు నిలిచిన వారిలో తానూ ఒకడినని.. జగన్ ను గతంలో తిట్టినవారికే పదవులు దక్కుతున్నాయని సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్టు సమాచారం. మరి.. ఈ విషయంపై సీఎం జగన్, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
285806 115803Even though you are any with the lucky enough choices, it comes evidently, while capture the fancy with the specific coveted by ly folks other helpful you you meet may possibly possibly properly have hard times this specific dilemma. pre owned awnings 52493
107097 971170Respect to site author , some great entropy. 537342