ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడిపై వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. గ్రామంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. రెండు వర్గాల మధ్య గతంలోనే రాజీ కుదిర్చానని అన్నారు. అయితే.. తనపై దాడి చేసింది టీడీపీ వారేనని.. వైసీపీ నేతలు కాదని స్పష్టం చేశారు. హత్యకు గురైన గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
అంతకుముందు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గ్రామానికి వెళ్లారు. అయితే.. పార్టీలోని మరో వర్గం ఆయన్ను అడ్డుకుంది. ఈక్రమంలో ఆయనపై దాడి కూడా జరిగింది. తోపులాటలు, రాళ్ల దాడి జరిగాయి. వైసీపీ నేతల్లోనే కొందరు ఆయనపై పిడిగుద్దులతో దాడి చేశారు. పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. అతి కష్టం మీద ఆయన్ను అక్కడి నుంచి తరలించి బైక్ పై ఆయన్ను గ్రామం దాటించారు.
598136 147133Currently truly do not stop eating because there is yet the decision which you will transform into. Work from your home us rrs often a fad for that who wants to earn funds however still enough time requires most substantial occasions employing children and kids goes for as the modern habit. attract abundance 435158
613364 790918Read More HERE. I bookmarked it. 377123