Switch to English

తేల్చేసిన ‘పిఠాపురం’ వర్మ.! వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యిందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,113FansLike
57,764FollowersFollow

పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో వైసీపీ మొదటి నుంచీ ఓ చిత్రమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారీ వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వర్మ.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి పొత్తులో భాగంగా, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న వర్మ, ఆ సీటుని త్యాగం చేయక తప్పలేదు.

జనసేన నుంచీ, టీడీపీ నుంచీ.. ఆ మాటకొస్తే, బీజేపీ నుంచి కూడా ఈ తరహా త్యాగాలు నడిచాయ్. అంతిమంగా, కూటమి బంపర్ విక్టరీ కొట్టిందనుకోండి.. అది వేరే చర్చ. అయితే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని దెబ్బ కొట్టడానికి, వర్మ ఫ్యాక్టర్‌ని వైసీపీ వాడుకునేందుకు విచ్చలవిడిగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.

టీడీపీ కార్యకర్తల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు, వర్మకి మద్దతుగా పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పిఠాపురంలో నినాదాలు చేయడం చూశాం. అప్పట్లో అదో సంచలనం. కానీ, వర్మ ఆ వివాదానికి వెంటనే ముగింపు పలికేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తనవంతు కృషి చేసిన మాట వాస్తవం.

వర్మకి రాజకీయ భవిష్యత్తు బావుంటుందనీ, ఈ క్రమంలో తాను చేయగలిగిందంతా చేస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా. అయితే, తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వర్మకి అవకాశం దక్కలేదు. అదే సమయంలో, నాగబాబుకి అవకాశమిచ్చారు. కూటమి తరఫున నాగబాబుకీ, సోము వీర్రాజుకీ.. అవకాశమిచ్చారు చంద్రబాబు.

జనసేనకు ఒక సీటు కేటాయించగా, అది నాగబాబుకి వెళ్ళింది. బీజేపీకి ఒకటి కేటాయించగా, అది సోము వీర్రాజుకి వెళ్ళింది. టీడీపీ నుంచి ముగ్గురికి అవకాశమిచ్చారు చంద్రబాబు. ఆ ముగ్గురిలో వర్మ పేరు లేదు. ఇది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం.

కానీ, వైసీపీ మాత్రం వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్.. అంటూ దుష్ప్రచారానికి తెరలేపింది. టీడీపీలో వైసీపీకి సహకరించే ఓ వర్గం కూడా పవన్ కళ్యాణ్ మీద నిందారోపణలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఓ వర్గం మీడియా, జనసేనకు సంబంధం లేని విషయాన్ని జనసేనకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది.

జనసేన తరఫున ఆ పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ దుష్ప్రచారాన్ని ఖండించారు. మరోపక్క, వర్మ కూడా తమ పార్టీ అధినాయకత్వం ఎలా నిర్ణయిస్తే, అలా తాను నడుచుకుంటానంటూ స్పష్టతనిచ్చారు. పదవుల విషయమై చంద్రబాబుదే తుది నిర్ణయమనీ చెప్పారు వర్మ.

వర్మ ప్రకటనతో ఒక్కసారిగా వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వర్మ మీద సింపతీ చూపిస్తే, టీడీపీని కాదని వర్మ వైసీపీలోకి వచ్చేస్తారని వైసీపీ నేతలు చాలా చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపించింది వ్యవహారం. గతంలో కూడా వైసీపీ ఇదే తరహా గేమ్ ప్లాన్ అమలు చేసి, చేతులు కాల్చుకుంది.

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ – వర్మ మధ్య కూడా సన్నిహిత సంబంధాలే వున్నాయ్. ఇవన్నీ తెలిసీ పదే పదే వైసీపీ చేతులు కాల్చుకోవడాన్ని ఎలా చూడాలి.?

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

ఆంధ్రా, తెలంగాణ.. మళ్ళీ ఈ కొత్త పంచాయితీ ఎందుకొచ్చింది.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి పదేళ్ళకు పైనే అయ్యింది.! కానీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి పంచాయితీ మాత్రం కొనసాగుతూనే వుంది. వైసీపీ, టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఒకేసారి అధికారంలో...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

పిఠాపురం నుంచే మార్పు మొదలు కావాలి: రూల్ బుక్ తప్ప మరో మాట లేదు

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ‘మోడల్ పిఠాపురం’...

Daily Horoscope: ఆర్థిక లాభ సూచనలు మేషం వారికి, ఉద్యోగంలో పురోగతి కన్య వారికి

జనవరి 8, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు చంద్రమాన ప్రభావంతో ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ...

80వ రోజు ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ… విశాఖ టీడీపీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు

విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విశాఖ నగరం మాత్రమే కాకుండా పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు,...