‘ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది..’ అన్న మాట ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి రావడమంటే, ‘ప్రజల్లో ఆందోళన పెంచకూడదు’ అన్న ఉద్దేశ్యాన్ని మాత్రమే ఆ పాలకుడి వ్యాఖ్యల నుంచి చూడాలి. కానీ, దానికి కొనసాగింపుగా బాధ్యతగలిగిన ఓ ఉన్నతాధికారి ’650 గ్రాముల పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఆరు గంటలకు ఓ సారి వేసుకోవాలి..’ అని సూచిస్తే మాత్రం, అది పూర్తిగా బాధ్యతారహిత్యమే.
సదరు అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియా, ‘పారాసిటమాల్తో అద్భుత ఫలితం..’ అంటూ కరోనా వైరస్ గురించి ప్రచారం చేస్తే, అది నూటికి నూరుపాళ్ళూ దుష్ప్రచారమే. ఎందుకోసం ఇదంతా జరుగుతోంది.? నిజంగా ప్రజల క్షేమం ఆశిస్తే, ఇలాంటి ప్రకటనలు వస్తాయా.? ఇలాంటి ప్రచారాలు తెరపైకి వస్తాయా.? జ్వరం తగ్గించడానికి పారాసిటమాల్ దివ్యౌషధమే. కానీ, కరోనా వైరస్ ద్వారా జ్వరం ఒక్కటే వస్తుందని ఎలా చెప్పగలం.?
చాలామందికి అసలు వ్యాధి లక్షణాలే కన్పించకుండా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందుతోందని పరిశోధనలు నిరూపించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని మెడిసిన్ కాంబినేషన్స్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అవి ప్రయోగాల దశలో వున్నాయనీ, త్వరలోనే మందు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకోపక్క, కరోనా బాధితులకు రకరకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల మధ్య ఓ అవగాహనతో వ్యవహారం నడుస్తోంది. రకరకాల మందుల్ని ఉపయోగిస్తున్నారు. ఆ వైద్యుల నుంచి సమాచారం తీసుకుని, దాన్ని ప్రచారంలోకి తెస్తే అదో లెక్క.
కొందరు వైద్యులే, పారాసిటమాల్ ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పారాసిటమాల్పై ప్రచారం, లేనిపోని దారుణాలకు కారణమవుతుందన్నది నిర్వివాదాంశం. ‘జ్వరం వస్తే దాన్ని తగ్గించడానికి పారాసిటమాల్ వాడతాం..’ అని వైద్యులు చెబుతున్నా, ఆ వైద్యులే, పారాసిటమాల్తోనే కరోనా తగ్గిపోతుందనేది దుష్ప్రచారమని స్పష్టం చేస్తున్న విషయాన్ని సోకాల్డ్ పాలకులు, వారికి వత్తాసు పలికే మీడియా మానుకోవాలి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, కరోనా వైరస్ విషయమై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. వైద్య నిపుణులు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు ప్రజలకి. అవన్నీ పాటించాల్సిందే.
640661 379767Hey I was just seeking at your internet site in Firefox and the image at the top with the link cant show up properly. Just thought I would let you know. 144378