Switch to English

వైసీపీ రివ్యూలు.! అప్పుడూ ఇప్పుడే, అదే సినిమా పిచ్చి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

ఏం.. రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి వుండకూడదా.? ఎందుకు వుండకూడదు.. వుండొచ్చు.! కాకపోతే, రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే.. అదే ఒకింత అసహ్యంగా వుంటుంది.

అసలు విషయానికొస్తే, వైసీపీ హయాంలో మంత్రులు, సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ నుంచి ఏదన్నా సినిమా వస్తే చాలు, తొలి రోజే.. డిజాస్టర్ రివ్యూలు ఇచ్చేవారు వైసీపీ నాయకులు, అందునా మంత్రులైతే మరీనూ.!

సినిమా విడుదలకు ముందు కూడా దిక్కుమాలిన రివ్యూలతో మంత్రులు పరువు పోగొట్టుకునేవారు. సినిమాలో సత్తా వుంటే, ఏ రివ్యూ కూడా సినిమాని ఆపలేదు. వైసీపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డం పడే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే.

మరో సినీ నటుడు నాని నటించిన సినిమాలకి కూడా వైసీపీ అడ్డం పడుతూ వచ్చేది. అంతెందుకు, ‘పుష్ప ది రైజ్’ సినిమా విషయంలోనూ వైసీపీ చేసిన చెత్త రివ్యూల హడావిడి అంతా ఇంతా కాదు. కానీ, ‘పుష్ప 2 ది రూల్’ విషయానికొచ్చేసరికి సీన్ మారిపోయింది.

ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్ళాడు సినీ నటుడు అల్లు అర్జున్. ఆ తర్వాతి నుంచీ అల్లు అర్జున్‌ని తమ నాయకుడిగా వైసీపీ మార్చేసుకుంది. అందుకే, ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి ప్రమోషన్ల బాధ్యతని వైసీపీ పూర్తిగా తన భుజానికెత్తుకుంది.

వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన పలువురు నాయకులు, సోషల్ మీడియా వేదికగా పుష్ప అదిరింది.. అంటూ రివ్యూలు ఇచ్చేశారు. కొందరైతే ‘పుష్ప 2 ది రూల్’ బాగుందని చెప్పడం కంటే, అల్లు అర్జున్‌ని ఎలివేట్ చేస్తూ, మెగా కాంపౌండ్ మీద బురద చల్లేందుకు విశ్వప్రయత్నాలూ చేశారు.

సినిమాలోని డైలాగుల్ని తమకు తోచినట్లు మార్చేసి, అల్లు అర్జున్‌కీ, మెగా కాంపౌండ్‌కీ దూరం పెంచే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా పేరు చెప్పి, నానా రచ్చా చేసింది.

ఇన్ని తంటాలు పడినా, ‘పుష్ప 2 ది రూల్’ టీమ్ మాత్రం, సినిమా విడుదలయ్యాక, మెగాస్టార్ చిరంజీవిని కలిసి, ఆయన ఆశీస్సుల్ని తీసుకుంది. దర్శకుడు సుకుమార్ సహా మైత్రీ నిర్మాతలు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లో కలిసి ‘బ్లెస్సింగ్స్’ తీసుకున్నారు.

దాంతో, అప్పటిదాకా చిరంజీవి మీద విమర్శలు చేస్తూ అల్లు అర్జున్‌ని లేపిన వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా నీరుగారిపోయారు.

అయినా, వైసీపీ నాయకులకు ఇదేం సినిమా పిచ్చి.? వైసీపీకి కూడా కొందరు నిర్మాతలు నటీనటులు సానుకూలంగా వుంటారు కదా. వారితో సినిమాలు తీయించుకుంటారు కదా.? ఇతర సినిమాల మీద, ఇతర హీరోల మీద రాజకీయంగా పడి ఏడవడం ఏంటి.?

సినిమా

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

సమంత సామ్రాజ్యం రూ. 200 కోట్లు దాటింది! భర్త రాజ్ కన్నా ఎక్కువే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి హైలైట్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న సమంత ఇప్పుడు దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

యధార్థ సంఘటనల ఆధారంగా “విధాత”.. త్వరలో.

విధాత సినిమా తొలి కాపీ సిద్ధమైంది. Abc ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం వహించగా, నిర్మాతగా అప్పిని పల్లె భాస్కరాచారి పనిచేశారు. యదార్థ సంఘటన ఆధారంగా...

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....