పౌరుషం వుంటే రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసెయ్యాలట. అలాగని వైసీపీ ఎంపీ భరత్ మార్గాని డిమాండ్ చేసేశారు. నిజానికి, రఘురామకృష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు.. నర్సాపురం ఎంపీగా. తానింకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతననే చెప్పుకుంటున్నారు. సో, ఇక్కడాయన పౌరుషం గురించిన ప్రశ్నే ఉత్పన్నం కాదు.
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గెలిచిన పార్టీని కాదని, వైసీపీలోకి వెళ్ళారు గనుక.. పౌరుషం వుంటే, వాళ్ళంతా రాజీనామా చేయాలి. అసలు వైసీపీకే పౌరుషం వుంటే, అలా తమ పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలి. ఇక్కడ వైసీపీకే పౌరుషం లేదాయె. లేకపోతే, రఘురామని ప్రశ్నించడమేంటి.?
పౌరుషం గట్టిగా వుందని వైసీపీ నమ్మితే, రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేసెయ్యాలి. కానీ, చెయ్యదు. అంటే, వైసీపీకి పౌరుషం లేదని అనుకోవాలా.? అన్నది సోషల్ మీడియాలో దూసుకొస్తున్న ప్రశ్నల సారాంశం. ఈటెల రాజేందర్ వ్యవహారం వేరు. ఆయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, మంత్రి వర్గం నుంచి తొలగించారు. దాంతో, వేరే దారి లేక ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేశారు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకీ రాజీనామా చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజుని వైసీపీ నుంచి సస్పెండ్ చేసేంత సాహసం చేయగలరా.? ఇన్ని రోజులు చెయ్యలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? వైసీపీ ఎంపీ భరత్ మార్గాని, రఘురామకృష్ణరాజు పౌరుషాన్ని ప్రశ్నిస్తున్నట్టు లేదు. సొంత పార్టీని ఎద్దేవా చేస్తున్నట్టుంది. వైసీపీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నట్టుంది పరిస్థితి. రోజులు మారాయ్.. ముందు ముందు వైసీపీకి ఇలాంటి తలనొప్పులు చాలానే ఎదురుకానున్నాయ్.. పౌరుషాల పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పినోళ్ళంతా, ఆ తర్వాత తమ దారి తాము చూసుకున్నోళ్ళే.
70919 31222It is in fact a cool and beneficial piece of info. Im glad that you shared this helpful information with us. Please maintain us informed like this. Thanks for sharing. 441999
577345 620070An fascinating discussion could be worth comment. I feel you must write on this topic, it might surely be a taboo topic but normally people are not enough to dicuss on such topics. To a higher. Cheers 378494