ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,031FansLike
57,764FollowersFollow

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు మరియు వీరమహిళలను గౌరవిస్తూ ఐక్యతతో పని చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూటమి సమన్వయ కమిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని, జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌దే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.

బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని సిగడం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కె. నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు  వరుసగా జనసేనలోకి చేరిక

జనసేనలో చేరిన వారిలో వైసీపీలో పీఏసీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రస్తుత సర్పంచ్ తిరుమరెడ్డి గౌరీశంకర్, మక్కా సాయిబాబు నాయుడు, బత్తుల స్వాతి, టెంకల రామకృష్ణ, ఎర్రబోలు సింహాచలం, రౌతు నారాయణరావు, కోమర్ల సామయ్య, గొరుసుపూడి నారాయణరావు, ఇనపకుర్తి అప్పలదాసు, కోనల సత్యనారాయణ, ఎర్రబోలు అన్నారావు, అంకం జగన్నాథం, బత్తుల వెంకట కృష్ణారావు, యాసర్ల శివ, కాకర్ల నీలకంఠం, దుర్గాసాయి రామారావు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా కె. నాగబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన పలువురు నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. చాలా మంది జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అయితే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోవడం లేదని, మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులను మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య వంటి నాయకులు కూడా అదే కారణంతో పార్టీలో చేరారని పేర్కొన్నారు.

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు  వరుసగా జనసేనలోకి చేరిక

జనసేన పార్టీ ఎన్నో అపజయాలను చూసిందని, ఒక విజయం వచ్చినందుకు అతిగా ఉప్పొంగే పార్టీ కాదని నాగబాబు అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. అన్ని మతాలు, అన్ని కులాలను సమానంగా గౌరవించడం జనసేన సిద్ధాంతమని పేర్కొన్నారు. తాను 14 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉందని, కార్యకర్తల మనోభావాలు బాగా తెలుసని తెలిపారు. కార్యకర్తల గౌరవం దెబ్బతినకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు తాలాబత్తుల పైడిరాజు, వడ్డాది శ్రీనివాసరావు, సిగడం మండలం ఉపాధ్యక్షుడు పొగిరి అప్పలనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా జనసేనలో చేరిన సర్పంచులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సర్పంచుల గౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. ప్రజల కోసం పని చేయాలని ఎన్నికైన సర్పంచులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన విలువ కూడా సర్పంచులకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు  వరుసగా జనసేనలోకి చేరిక

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా తీసుకుంటున్న చర్యలు చూసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవ కోసం జనసేనతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

చరణ్ విషయంలో తారక్ సైలెన్స్ ఎందుకు?

ఒకప్పుడు “రామ్ చరణ్ బర్త్‌డే అంటే రాత్రి 12 గంటలకు వాళ్ల ఇంట్లో ఉంటా… తప్పకుండా విష్ చేస్తా” అని చెప్పిన తారక్ మాటలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....

Daily horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

“ఏప్రిల్ 11 , 2026 శనివారం రాశిఫలాలు” ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి లాభాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...

Daily Horoscope: సింహ రాశికి గుర్తింపు సూచనలు.. మీన రాశికి ఆర్థిక ఉపశమనం కనిపించే రోజు

ఏప్రిల్ 9 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి పనుల్లో ఊపొస్తే, మరికొన్ని రాశుల వారు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రయాణాలు,...