‘త్వరలో మా పార్టీలోకి వలసలు జోరందుకోనున్నాయి.. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు మాతో టచ్లో వున్నారు. అన్ని అంశాలపైనా చర్చిస్తున్నాం.. ఎవరెవరో మా పార్టీలోకి వస్తారో ముందు ముందు మీరే చూస్తారు..’ అంటూ ఏపీ బీజేపీ ముఖ్య నేతలు చాలా కాన్పిడెంట్గా చెబుతున్నారు. సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక.. కంప్లీట్ ఎనర్జీని ప్రదర్శిస్తూ మీడియాలో ఇటు టీడీపీనీ, అటు వైసీపీనీ కడిగి పారేస్తోన్న విషయం విదితమే. ‘టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతాయట కదా..’ అంటూ వైసీపీ అనుకూల వర్గానికి చెందిన మీడియా ప్రతినిది ప్రశ్నిస్తే, ‘టీడీపీ నుంచి మాత్రమే కాదు.. వైసీపీ నుంచి కూడా వలసలు వుంటాయ్..’ అని సెలవిచ్చారు సోము వీర్రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
‘మరోపక్క, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం గనుక.. మా విధానాలు నచ్చి, మా సిద్ధాంతాల్ని మెచ్చి మా పార్టీలోకి వచ్చేవారి విషయంలో సానుకూలంగా స్పందిస్తాం..’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తదితర బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇంతకీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంగతేంటట.? ఈ విషయమై మాత్రం బీజేపీ నేతలు పెదవి విప్పడంలేదు. కాగా, సీబీఐ మాజీ జేడీ, జనసేన మాజీ నేత లక్ష్మినారాయణ త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్ళారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆగస్ట్ నెలాఖరు నాటికి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చని సాక్షాత్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతుండడం గమనార్హం.
‘నా ఈక్వేషన్స్ నాకున్నాయ్.. పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.? ఎలా బలోపేతం చేయాలి.? అన్నదానిపై ఖచ్చితమైన అవగాహనతో వున్నాను..’ అని అంటోన్న సోము వీర్రాజు, పార్టీ అధిష్టానం దగ్గర తన స్టామినా నిరూపించుకోవాలంటే.. ఖచ్చితంగా పెద్ద నాయకుల్ని ఇతర పార్టీల్లోంచి లాగాల్సిందే. ఆ పని ఇప్పటికే ప్రారంభమయిన దరిమిలా, సోము వీర్రాజు ‘ముద్ర’ ఇటు బీజేపీ పైనా, అటు రాష్ట్ర రాజకీయాలపైనా ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.
989044 889069I like this internet site because so significantly utile stuff on here : D. 334548
137946 157537We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 629120