Switch to English

దేవుడా.. ఇప్పుడూ మీడియానీ, విపక్షాల్నీ తిట్టడమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాష్ట్రం కరోనా వైరస్ కారణంగా తల్లడిల్లుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ రోజు ఏకంగా 3500కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు నమోదైన కొత్త కేసుల సంఖ్య దాదాపు 22 వేలు. 72 మంది ప్రాణాలు కోల్పయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధ్యతగల మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం సంగతి కాస్త పక్కన పెట్టి, మీడియాపైనా.. విపక్షాలపైనా విరుచుకుపడటానికి ప్రాధాన్యతనిస్తున్నారంటే, ఏమనుకోవాలి.? నిజానికి, ఇది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం.

విపక్షాలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకో, కింది స్థాయిలో వున్న దారుణ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకో.. విమర్శలు చేయడం అన్నది సహజాతి సహజం. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, కీలక సమయాల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అయితే, గతంలో ఎన్నడూ చూడని మహమ్మారి కరోనా వైరస్. ఈ సమయంలో విపక్షాలు విమర్శలు చేసినా, సూచనలు చేసినా.. వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. తన పని తాను చేసుకుపోవాలి.

అంతే తప్ప, మీడియా మీదనో, విపక్షాల మీదనో.. విమర్శలు చేయడం కోసం మంత్రులు, ఇతర బాధ్యతగల వ్యక్తులు.. విలువైన సమయాన్ని వృధా చేయాలనుకోవడం అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త స్ర్టెయిన్ గురించి దేశమంతా చర్చించుకుంటోంది. దీన్ని ఆంధ్రపదేశ్ స్ట్రెయిన్ అని వ్యవహరిస్తున్నారు కూడా. దీని విషయమై ప్రభుత్వం తొందరపడి ప్రకటనలు చేయడం సమంజసం కాదు. మీడియాలో వచ్చే కథనాలు, ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కాస్తయినా ఉపయోగపడతాయి. భయం అక్కర్లేదు.. అని కరోనా గురించి ఎవరైనా చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

భయపడాల్సిందే.. ఎందుకంటే, భయం లేకపోతేనే జనం రోడ్ల మీదకు వచ్చేయగలుగుతున్నారు మరి. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం 18 గంటల కర్ఫ్యూ పెట్టినా.. చాటుగా మాటుగా జనం తిరిగేస్తున్నారు. అలాంటివారి విషయమై కఠిన చర్యలకు ప్రభుత్వం సమాయత్తమవ్వాలి. ఎక్కడ ఇలాంటి సమస్యలున్నాయో సమాచారాన్ని సేకరించి, చర్యల దిశగా మంత్రులు స్పష్టమైన ఆదేశాలివ్వాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వసతుల లేమి గురించి లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులొస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే, రాష్ట్రంలో పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. వీటి గురించి శ్రద్ధ పెట్టాలి తప్ప, విపక్షాలపై బురద చల్లితే, రాష్ట్ర ప్రజలకు అదెలా మేలు జరుగుతుందో మంత్రులకే తెలియాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...