వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణాన్ని చెందడాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘ఒదార్పు యాత్ర’ గుర్తుందా.? ఆ ఓదార్పు యాత్ర, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో అతి పెద్ద మైలు రాయి.!
అప్పుడు, అలా ఓదార్పు యాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడెందుకు కౌలు రైతుల విషయంలో ఓదార్పు యాత్ర చేయడం లేదు.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ‘కౌలు రైతు భరోజా యాత్ర’ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తనవంతుగా, తన వ్యక్తిగత సంపాదన నుంచి ఒక్క కోటుంబానికీ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు వైఎస్ జగన్.
నిజానికి, ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతులు ప్రాణాలు కోల్పోవడమంటే, అది ప్రభుత్వ వైఫల్యం. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలి. ఏడు లక్షల ఆర్థిక సాయం అందించేస్తున్నామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. అదే నిజమైతే, జనసేనాని సాయం కోసం బాధిత కుటుంబాలు ఎందుకు ఎదురుచూస్తున్నాయి.? తమకు ప్రభుత్వ సాయం అందలేదని ఎందుకు కన్నీరు మున్నీరవుతున్నాయి.?
‘పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు..’ అంటోంది వైసీపీ సర్కారు. పోనీ, అదే నిజమని అనుకుందాం. మరి, ప్రభుత్వం చేయాల్సిందేంటి.? ముఖ్యమంత్రి వెళ్ళలేకపోతే, బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి మంత్రులైనా వెళ్ళాలి కదా.?
అప్పట్లో ఓదార్పు యాత్ర చేసింది రాజకీయ అవసరాల కోసం అని వైసీపీ ఇప్పుడు చెప్పకనే చెబుతోంది. రాజకీయం కోసం అప్పుడు ఓదార్పు.. ఇప్పుడేమో, ప్రజలు నిలదీస్తారేమోనని మొహం చాటేయడం. ఇదీ నిఖార్సయిన రాజకీయమంటే.
644959 177213Lovely sharp post. Never considered that it was that straightforward. Praises to you! 13608
682132 751147I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 84243