Switch to English

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.. అధికార పార్టీ నుంచి.. అలాగే, పోలీసు అధికారుల నుంచీ వచ్చింది. ఓ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.?

ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకోసమంటూ పదుల సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని, ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా వెళితే, దాన్ని పోలీసులు అడ్డుకుంటారా.? లేదంటే, ‘వినత పత్రం కదా..’ అని ఊరుకుంటారా.? అప్పుడు అలా పోలీసు వ్యవస్థ లైట్ తీసుకుంది కాబట్టే, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడిలా చెలరేగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పరిస్థితి మరీ అధ్వాన్నం. అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, ఇది రాజకీయ దాడి కాదు.. తీవ్రవాద దాడి.. అన్నట్టు తయారైంది పరిస్థతి.. అన్న భావన టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.

‘ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. అంతేనా, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్ర పతి పాలన పెట్టాలనే డిమాండ్ కూడా చేసేశారు ప్రతిపక్ష నేత.

సరే, చంద్రబాబు డిమాండ్ చేసేసినట్టు కేంద్రం అంత రిస్క్ చేస్తుందా.? అన్నది వేరే చర్చ. కానీ, రాష్ట్రంలో నేడు చోటు చేసుకున్న విధ్వంసం చూస్తే.. అధికార పార్టీ తప్ప, రాష్ట్రంలో ఇంకెవరూ వుండకూడదన్నట్టుగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తుంది.

ఇంతటి విధ్వంసాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేకపోవడమా.? ఏకకాలంలో రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడమా.? కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని మరీ దాడికి వెళ్ళడమంటే.. పక్కా ప్లానింగ్ ఈ మొత్తం దాడుల వ్యవహారం వెనుక వుండే వుండాలి.

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గంజాయి స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలతోనే, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని పరిస్థితి చెయ్యిదాటిందంటోన్న అధికార వైసీపీ కల్లబొల్లి కబుర్లనే పోలీసులూ వల్లించబోతున్నారా.? ఏమోగానీ.. రాష్ట్రం పరువు పోయింది.. దేశంలో ఈ తరహా విధ్వంసాలు బీహార్ తదితర రాష్ట్రాల్లో చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటన్నిటికంటే ముందు వరుసలో నిలబెట్టేశారిప్పుడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...