‘కార్లు, పెళ్ళాలు..’ అంటూ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని మహిళలపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
వైసీపీ నాయకులు కొందరు, శాసన సభ సాక్షిగా, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిపైన అత్యంత అసహ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించిన సందర్భమూ మర్చిపోయేది కాదు.! పోసాని కృష్ణ మురళి, ప్రెస్ మీట్ పెట్టి మరీ, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు, నారా లోకేష్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దానికి స్క్రిప్ట్ అందించింది స్వయంగా సాక్షి మీడియా.
ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.! రాజకీయాల్లో విమర్శలు అంటే, బూతులు మాత్రమే.. అన్న ట్రెండ్ తీసుకొచ్చిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఫాలో అవుతున్నాయా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.!
తాజాగా, టీడీపీ కార్యకర్త ఒకరు, ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సతీమణి భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. యూ ట్యూబ్ ఛానళ్ళు ఈ రోజుల్లో ఎంత దిగజారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. నిజానికి, ఈ యూ ట్యూబ్ చానళ్ళ బూతు కూడా వైసీపీ పాపమే.
వైసీపీ హయాంలో, బోరుగడ్డ అనిల్ని వైసీపీ కుల మీడియానే హైలైట్ చేసింది. ఆ కుల మీడియాకి సంబంధించిన యూ ట్యూబ్ చానళ్ళే, అతనితో బూతులు మాట్లాడించాయి.
భారతిపై, టీడీపీ కార్యకర్త వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, బూతు విత్తనం నాటిన వైసీపీ, దాన్ని మహా వృక్షంగా చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రయోజనం ఏముంటుంది.?
అయితే, కూటమి పాలనలో ఇలాంటివాటికి ఆస్కారం వుండకూడదు. తప్పు ఎవరు చేసినా, అది తప్పే. కఠినంగా శిక్షించాల్సిందే.. బూతు రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిందే.
