ఏ పార్టీలోనైనా వర్గపోరు సహజం. పార్టీ పెద్దలు దానిని జాగ్రత్తగా అధిగమిస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకవేళ విఫలమైతే కష్టాలు తప్పవు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ఈ వర్గపోరుతోనే బేజారవుతోంది. చాలా నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీలో బలమైన నాయకురాలిగా ఉన్న రోజాకు సైతం ఇలాంటి అనుభవం ఎదురైంది. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సరైన చర్యలు తీసుకోలేకపోతోది.
వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా.. కేడర్ విషయంలో పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 9 నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో కొన్ని ప్రజామోదం పొందగా.. మరికొన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. వీటినే ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీకి సవాల్ గా మారాయి. ఒక విధంగా ఈ ఎన్నికలను వైసీపీ 9 నెలల పాలనకు రెఫరెండంగానే భావిస్తున్నారు. ప్రతిపక్షాలు గెలిచినా, గెలవకపోయినా వారికి పెద్దగా పోయేది ఏమీ ఉండదు. అదే అధికార పార్టీకి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది.
వైసీపీ పాలన బాగోలేదనడానికి ఇదే నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారంటూ ప్రతిపక్షాలు తమ పోరును మరింత ఉధృతం చేస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీలో వర్గపోరుపై అధిష్టానం దృష్టి సారించినట్టుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఆధారంగానే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.
999041 532573An intriguing discussion is going to be worth comment. I believe which you can write read a lot more about this subject, could effectively certainly be a taboo topic but typically folks are inadequate to chat on such topics. To a higher. Cheers 778878
629111 769467I like the valuable details you supply within your articles. Ill bookmark your blog and check once more here frequently. Im quite certain I will learn lots of new stuff correct here! Excellent luck for the next! 14342