Switch to English

పాలన చేతకాక జనం గొంతు నొక్కడమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా విభాగం ఎంత గొప్పగా పనిచేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడంలో వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసింది. ‘ఎవరో సామాన్యులు కడుపు మండి తమ అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో వ్యక్తం చేస్తే.. వారిపై ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు దిగడమా.? అరెస్టులు చేయడమా.?’ అంటూ అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

వైఎస్‌ జగన్‌ ఒక్కరే కాదు, విజయసాయిరెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలందరిదీ అదే తీరు. ‘మీడియా ఎలాగూ చచ్చిపోయింది.. సోషల్‌ మీడియాలో అయినా ప్రజలు తమ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పనివ్వండి..’ అని వైసీపీ నినదించింది. ఇప్పుడు అదే వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ‘మాట మార్చడం, మడమ తిప్పడం’లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న వైఎస్‌ జగన్‌, ఇప్పుడు సోషల్‌ మీడియా ‘గొంతు కోసేందుకు’ ప్రయత్నిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టినా అరెస్ట్‌ తప్పదన్న సంకేతాల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపిస్తోంది. అయినా, సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్ట్‌ వచ్చిన వెంటనే.. దానిపై దుమ్మెత్తిపోసేందుకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అలర్ట్‌గానే వుంటుంది కదా.!

జుగుప్సాకరమైన రాతలు, అసభ్యకరమైన వ్యక్తిగత దూషణలకు శిక్ష పడాల్సిందే. సోషల్‌ మీడియా ఇందుకు మినహాయింపేమీ కాదు. మరి, అదే పని చేస్తోన్న వైసీపీ నేతల మాటేమిటి.? మంత్రులేకాదు, స్పీకర్‌ కూడా విచ్చలవిడిగా విపక్షాలపై బూతులు మాట్లాడేస్తున్న రోజులివి. చర్యలు తీసుకోవాల్సి వస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుగా తమ పార్టీ నుంచే ప్రారంభించాలి. అలా చేయగలిగితే వైఎస్‌ జగన్‌కి ఎవరైనా సెల్యూట్‌ చెయ్యాల్సిందే.

‘పాలన చేతకాక జనం గొంతు నొక్కుతున్నారు..’ అనే అపప్రధ చంద్రబాబు మూటగట్టుకున్నారు.. అదే పని వైఎస్‌ జగన్‌ చేస్తోంటే, ‘ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే’ అని కాక ఇంకేమని అనాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...