Switch to English

గోవుల మరణాలపై వైసీపీ కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

టీటీడీకి చెందిన ఎస్ వి గోశాలపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్ ఏపీ రాజకీయాల్లోకి ఈ గోశాలను తీసుకురావడం వెనక వైసీపీ కుట్ర దాగి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం జగన్ ను సనాతన ధర్మ పరిరక్షకుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేస్తోంది. గోశాలలో 100 గోవులు చనిపోయాయని.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. అపచారం అంటూ నానా హైరానా చేస్తోంది. ఫేక్ ప్రచారాలతో వైసీపీ కొత్త సింపతీ డ్రామాలకు తెర తీసింది. ఇదంతా చేయడానికి అసలు కారణం వేరే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది.

అందులో భాగంగానే గోశాలలపై విజిలెన్స్ నివేదిక రెడీ చేస్తోంది. ఈ నివేదికలో వైసీపీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం వెళ్లింది. అతను ఈ విషయాన్ని మాజీ టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి చేరవేశారు. తమ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంతో వైసీపీ గోవుల మరణాలు అనే విషయాన్ని తెరమీదకు తెచ్చింది. తమ మీద నింద పడకముందే కూటమి మీద బురద జల్లితే ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావించారు కాబోలు. అందుకే హరినాథ్ రెడ్డి ఇచ్చిన అచ్చీరాని సమాచారంతో భూమన కరణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గోశాలలో 100 గోవులు చనిపోయాయి అంటూ సంచలనానికి తెరతీశాడు.

అక్కడి నుంచే ఈ వివాదం ముదురుతోంది. దీన్ని టీటీడీ అధ్యక్షుడు బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని భూమనపై ఆయన విరుచుకుపడ్డారు. హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే ముందుగానే గోశాలపై ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీ హయాంలో టీటీడీ గోసంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు. అప్పట్లో వారి హయాంలో గోవులు కుప్పలు, తెప్పలుగా చనిపోతే పట్టించుకోలేదు. చనిపోయిన వాటిని నిర్ధాక్షిణ్యంగా చెత్తబుట్టల్లో పడేశారు. నాసీరకం దాణాలు పెట్టి మూగజీవాల ప్రాణాలు తీశారు. ఇలా వందలాది గోవులు చనిపోయినా దాన్ని బయటకు రానివ్వకుండా అప్పటి అధికారి హరినాథ్ రెడ్డి మేనేజ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ హయాంలో ఏప్రిల్‌, 2022 – జనవరి 2023 మధ్య ఎస్వీ గోశాలలో 27, పలమనేరు గోశాలలో 26, కమలయ్యగారిపల్లి గోశాలలో 7.. మొత్తం 60 ఆవులు, దూడలు చనిపోతే వాటిని కప్పిపుచ్చారని విజిలెన్స్ లో తేలింది. వైసీపీ హయాంలో గోశాలల నిర్వహణ అధ్వానంగా ఉండేది. సరైన పరిశుభ్రత పాటించలేదు. గోవులకు అనారోగ్యం వచ్చినా చికిత్స చేయించక చాలా వరకు చనిపోయాయి. చివరకు గోవుల దాణాకు పిలిచిన టెండర్లలో కూడా అవినీతి జరిగిందని నివేదిక చెబుతోంది. యర్రావారిపాళెంలో ఆవులు లేకున్నా.. అక్కడకు దాణా టెంటర్లు పిలిచారు హరినాథ్ రెడ్డి. లేని ఆవులకు దాణా పేరుతో రూ. 1.78 కోట్లు చెల్లింపులు జరిగిపోయాయి. అంతే కాకుండా బయో మెన్యూర్‌ని ఎన్‌రిచ్డ్‌ బయోమెన్యూర్‌గా తయారు చేసేందుకు టన్నుకు రూ.7,500 చొప్పున చెల్లించారు.

చాలా సార్లు ఎక్స్ పైర్ అయిపోయిన మందులను గోవులకు వాడారు. 2019-24 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైనా, గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఒక్క 2024లోనే 179 ఆవులు చనిపోయినా ప్రభుత్వం బయటకు రానివ్వకుండా తొక్కి పెట్టేసింది. 2021 జులై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి రూ.78 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ దానిపై వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించలేదు. అప్పటి టీడీపీ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించి వందలాది గోవుల మరణానికి కారణం అయింది. కానీ ఇప్పుడు కూటమి హయాంలో 2025 జనవరి–మార్చి మధ్య 2,700 గోవుల్లో 43 మాత్రమే చనిపోతే దానిపై వైసీపీ అవకాశ రాజకీయాలు చేస్తోందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు నిర్వహణ మెరుగ్గా ఉందని.. గోవుల మరణాలు ఇప్పుడు తగ్గడమే కాకుండా రోజుకు 450 లీటర్ల పాల ఉత్పత్తిని 762 లీటర్లకు పెంచినట్టు చెబుతున్నారు.

సినిమా

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తాజాగా మూవీ టీజర్...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

వైసీపీ హయాంలో అరెస్టులు వర్సెస్, కూటమి హయాంలో అరెస్టులు.!

ఎంపీగా వున్న వ్యక్తిని వైసీపీ హయాంలో అరెస్టు చేయడం.. అప్పట్లో పెను సంచలనం. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణరాజు. కానీ, ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న కక్షతో, ఏకంగా దేశద్రోహం...

వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో గ్లోబల్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. ఎలా...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుందని చెబుతున్నారు 'గుర్తింపు' మూవీ టీమ్....