Switch to English

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,192FansLike
57,764FollowersFollow

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.. అనేది ఓ సామెత.! వైసీపీ వ్యవహారం ఇలానే వుందా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘సీజ్ ది ఫైర్’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్‌పై నినదించాక.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

కాకినాడ పోర్టే ఎందుకు.? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఇంత దారుణమైన అవినీతి, దోపిడీ వైసీపీ హయాంలో జరిగిందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 48 వేల కోట్ల రూపాయలు.. అంతకు మించిన అవినీతికి కాకినాడ పోర్టు ముఖ‘ద్వారం’గా మారిన వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. పేదోడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం, అక్రమార్కుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయల రూపంలో ఎలా వెళ్ళాయనే చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దొంగల్ని వదలొద్దని రాష్ట్ర ప్రజానీకం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణంపై ప్రత్యేక సిట్‌ని కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది.

అసలంటూ, రేషన్ బియ్యం.. పేదోళ్ళ ఇళ్ళకు చేరకుండా, టన్నుల లెక్కన విదేశాలకు ఎలా అక్రమ మార్గంలో ఎగుమతవుతోందో లెక్కలు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద వుంది. ఇంటి వద్దకే రేషన్.. అంటూ ఏర్పాటు చేసిన వాహనాలే ఈ అవినీతికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న సంగతి తెలిసిందే.

కాకినాడ పోర్టు వేదికగా బియ్యం స్మగ్లింగ్ నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు ఏకంగా పోర్టునే కాజేసేందుకు వైసీపీ పన్నిన కుట్రలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. పోర్టు మొత్తం వైసీపీ గుప్పిట్లో వుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని సందర్శించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

కేవీ రావు, జీఎంఆర్.. కాకినాడ పోర్టులో భాగస్వామ్యం కలిగి వుండగా, వాళ్ళని భయపెట్టి వైసీపీ పెద్దలు తమ పేరున, వాటాల్ని రాయించుకున్నారు. ఈ కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. తప్పు చేయడం, ముందస్తు బెయిల్ సంపాదించి తప్పించుకోవడం.. ఇది వైసీపీ మార్కు వ్యవహారం. చాలా కేసుల్లో వైసీపీ నేతలు ఇలానే తప్పించుకుంటున్నారన్న విమర్శ వుంది.

ఇదిలా వుంటే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సెజ్ భూముల్ని అక్రమ మార్గంలో సొంతం చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ‘నా దగ్గర డబ్బులున్నాయ్.. నేను కొనుక్కున్నాను..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఎలా భూముల్ని కొన్నారన్నది బహిరంగ రహస్యమే. బెదిరించడం, తక్కువ ధరలకే భూముల్ని కొట్టేయడం.. వైసీపీ మార్కు భూ దందా.

ఏదిఏమైనా, కేవలం ఆరోపణలకే పరిమితమైపోతే కుదరదు.! చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్, పోర్టు దొంగల్ని కటకటాల వెనక్కి పంపించడమే కాదు, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని ఆ దోపిడీ దొంగల నుంచే తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేసేలా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. మరీ ముఖ్యంగా సమీప భవిష్యత్తులో రేషన్ స్మగ్లింగ్‌కి ఎవరూ తెగబడకుండా కఠినమైన శిక్షలు పడేలా చేయగలగాలి.

సినిమా

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా,...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

రాజకీయం

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా, ఆయా హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...