Switch to English

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.. అనేది ఓ సామెత.! వైసీపీ వ్యవహారం ఇలానే వుందా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘సీజ్ ది ఫైర్’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్‌పై నినదించాక.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

కాకినాడ పోర్టే ఎందుకు.? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఇంత దారుణమైన అవినీతి, దోపిడీ వైసీపీ హయాంలో జరిగిందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 48 వేల కోట్ల రూపాయలు.. అంతకు మించిన అవినీతికి కాకినాడ పోర్టు ముఖ‘ద్వారం’గా మారిన వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. పేదోడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం, అక్రమార్కుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయల రూపంలో ఎలా వెళ్ళాయనే చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దొంగల్ని వదలొద్దని రాష్ట్ర ప్రజానీకం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణంపై ప్రత్యేక సిట్‌ని కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది.

అసలంటూ, రేషన్ బియ్యం.. పేదోళ్ళ ఇళ్ళకు చేరకుండా, టన్నుల లెక్కన విదేశాలకు ఎలా అక్రమ మార్గంలో ఎగుమతవుతోందో లెక్కలు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద వుంది. ఇంటి వద్దకే రేషన్.. అంటూ ఏర్పాటు చేసిన వాహనాలే ఈ అవినీతికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న సంగతి తెలిసిందే.

కాకినాడ పోర్టు వేదికగా బియ్యం స్మగ్లింగ్ నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు ఏకంగా పోర్టునే కాజేసేందుకు వైసీపీ పన్నిన కుట్రలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. పోర్టు మొత్తం వైసీపీ గుప్పిట్లో వుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని సందర్శించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

కేవీ రావు, జీఎంఆర్.. కాకినాడ పోర్టులో భాగస్వామ్యం కలిగి వుండగా, వాళ్ళని భయపెట్టి వైసీపీ పెద్దలు తమ పేరున, వాటాల్ని రాయించుకున్నారు. ఈ కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. తప్పు చేయడం, ముందస్తు బెయిల్ సంపాదించి తప్పించుకోవడం.. ఇది వైసీపీ మార్కు వ్యవహారం. చాలా కేసుల్లో వైసీపీ నేతలు ఇలానే తప్పించుకుంటున్నారన్న విమర్శ వుంది.

ఇదిలా వుంటే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సెజ్ భూముల్ని అక్రమ మార్గంలో సొంతం చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ‘నా దగ్గర డబ్బులున్నాయ్.. నేను కొనుక్కున్నాను..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఎలా భూముల్ని కొన్నారన్నది బహిరంగ రహస్యమే. బెదిరించడం, తక్కువ ధరలకే భూముల్ని కొట్టేయడం.. వైసీపీ మార్కు భూ దందా.

ఏదిఏమైనా, కేవలం ఆరోపణలకే పరిమితమైపోతే కుదరదు.! చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్, పోర్టు దొంగల్ని కటకటాల వెనక్కి పంపించడమే కాదు, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని ఆ దోపిడీ దొంగల నుంచే తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేసేలా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. మరీ ముఖ్యంగా సమీప భవిష్యత్తులో రేషన్ స్మగ్లింగ్‌కి ఎవరూ తెగబడకుండా కఠినమైన శిక్షలు పడేలా చేయగలగాలి.

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

అమరావతి ‘వైసీపీ విషం’.! ఏళ్ళ తరబడి నడుస్తున్న తతంగం.!

ఆయనెవరో జర్నలిస్టు అట.! ఆయన సాక్షిలో ఏదో మాట్లాడితే వైసీపీకి ఏంటి సంబంధమట.? ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వేశ్యల రాజధాని అమరావతి’ వివాదంపై స్పందించిన తీరు. సాక్షి మీడియా ఎవరిది.? అసలు, ఆ...

సంకర తెగ: వైసీపీ వర్సెస్ అమరావతి.!

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి అంటే, ఎందుకంత అసహ్యం.? నో డౌట్, వైసీపీ గత కొన్నేళ్ళుగా అమరావతిపై అసహ్యం పెంచుకుంటూనే పోతోంది. కారణాలేంటి.? అన్నది వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో...

అనుకున్న డేట్ కే వస్తున్న తమ్ముడు.. త్వరలోనే ట్రైలర్..

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ల‌య‌, స‌ప్త‌మీ గౌడ‌,...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు 48–50 మంది అతిథులు పాల్గొన్నారు. అక్కడ...

Plane Crash: గుజరాత్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..

Plane crash: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీ విమాన ప్రమాదం జరిగింది. గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం టేకాఫ్...