Switch to English

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,962FansLike
57,764FollowersFollow

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.. అనేది ఓ సామెత.! వైసీపీ వ్యవహారం ఇలానే వుందా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ పోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘సీజ్ ది ఫైర్’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్‌పై నినదించాక.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

కాకినాడ పోర్టే ఎందుకు.? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఇంత దారుణమైన అవినీతి, దోపిడీ వైసీపీ హయాంలో జరిగిందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 48 వేల కోట్ల రూపాయలు.. అంతకు మించిన అవినీతికి కాకినాడ పోర్టు ముఖ‘ద్వారం’గా మారిన వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. పేదోడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం, అక్రమార్కుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయల రూపంలో ఎలా వెళ్ళాయనే చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దొంగల్ని వదలొద్దని రాష్ట్ర ప్రజానీకం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణంపై ప్రత్యేక సిట్‌ని కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది.

అసలంటూ, రేషన్ బియ్యం.. పేదోళ్ళ ఇళ్ళకు చేరకుండా, టన్నుల లెక్కన విదేశాలకు ఎలా అక్రమ మార్గంలో ఎగుమతవుతోందో లెక్కలు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద వుంది. ఇంటి వద్దకే రేషన్.. అంటూ ఏర్పాటు చేసిన వాహనాలే ఈ అవినీతికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న సంగతి తెలిసిందే.

కాకినాడ పోర్టు వేదికగా బియ్యం స్మగ్లింగ్ నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు ఏకంగా పోర్టునే కాజేసేందుకు వైసీపీ పన్నిన కుట్రలు మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. పోర్టు మొత్తం వైసీపీ గుప్పిట్లో వుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని సందర్శించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

కేవీ రావు, జీఎంఆర్.. కాకినాడ పోర్టులో భాగస్వామ్యం కలిగి వుండగా, వాళ్ళని భయపెట్టి వైసీపీ పెద్దలు తమ పేరున, వాటాల్ని రాయించుకున్నారు. ఈ కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. తప్పు చేయడం, ముందస్తు బెయిల్ సంపాదించి తప్పించుకోవడం.. ఇది వైసీపీ మార్కు వ్యవహారం. చాలా కేసుల్లో వైసీపీ నేతలు ఇలానే తప్పించుకుంటున్నారన్న విమర్శ వుంది.

ఇదిలా వుంటే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సెజ్ భూముల్ని అక్రమ మార్గంలో సొంతం చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ‘నా దగ్గర డబ్బులున్నాయ్.. నేను కొనుక్కున్నాను..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఎలా భూముల్ని కొన్నారన్నది బహిరంగ రహస్యమే. బెదిరించడం, తక్కువ ధరలకే భూముల్ని కొట్టేయడం.. వైసీపీ మార్కు భూ దందా.

ఏదిఏమైనా, కేవలం ఆరోపణలకే పరిమితమైపోతే కుదరదు.! చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్, పోర్టు దొంగల్ని కటకటాల వెనక్కి పంపించడమే కాదు, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని ఆ దోపిడీ దొంగల నుంచే తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేసేలా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. మరీ ముఖ్యంగా సమీప భవిష్యత్తులో రేషన్ స్మగ్లింగ్‌కి ఎవరూ తెగబడకుండా కఠినమైన శిక్షలు పడేలా చేయగలగాలి.

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

ఎక్కువ చదివినవి

Urvashi Rautela: ‘బాలకృష్ణతో డ్యాన్స్ స్టెప్స్ పై వివాదం..’ స్పందించిన ఊర్వశి రౌతేలా

Urvashi Rautela: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అయితే.. సినిమాలోని దబిడి, దబిడి పాటలో ఊర్వశి రౌతేలాతో వేసిన స్టెప్స్ పై తీవ్ర...

జియో, ఎయిర్ టెల్, బీఎస్ ఎన్ ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్..!

మన దేశంలో సిమ్ నెట్ వర్క్ తోనే కాల్స్, ఇంటర్ నెట్ సదుపాయాలు వాడుతారు. ఏ సిమ్ వారి ఫోన్ లో వేసుకుంటే అదే సిమ్ తో అన్ని నెట్ వర్క్ లను...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. సైఫ్ కు...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 18 జనవరి 2025

పంచాంగం తేదీ 18-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు. తిథి: బహుళ పంచమి పూర్తిగా నక్షత్రం: పుబ్బ మ. 3.01...

‘గేమ్ ఛేంజర్’ ఇంపాక్ట్.! సమాజంపై ఆ స్థాయిలో.!

శంకర్ తెరకెక్కించే సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడంటే పాన్ ఇండియా.. అనే పేరు వాడుతున్నాంగానీ, శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా...