Switch to English

వైసీపీ వరద సాయం కోటి.! ఏ రూపంలోనో మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,762FansLike
57,764FollowersFollow

విజయవాడలో వరదల నేపత్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అయితే, ఈ విరాళాన్ని ఏ రూపంలో అందించాలన్నదానిపై పార్టీలో చర్చించి, నిర్ణయం వెల్లడించబోతున్నారట.! వినడానికి కామెడీగా లేదూ.! వైసీపీ అంటేనే కామెడీ మరి.!

మామూలుగా అయితే, విపత్తుల నేపథ్యంలో వ్యక్తులైనా, సంస్థలైనా, పార్టీలైనా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సాయం ప్రకటించడం చూస్తుంటాం. చాలా అరుదుగా మాత్రమే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు విరాళాలు ప్రకటిస్తుంటాయ్. ఎందుకు.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇక, వైసీపీ అయితే విరాళాలు ప్రకటించడం అనేది చాలా చాలా చాలా చాలా అరుదైన విషయం.! ఇటీవలే వరద ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కోరుతున్న వైసీపీ, వరద బాధితులకు వున్నపళంగా ఏమైనా సాయం చేసిందా.? అంటే, అదీ లేదాయె.!

వైసీపీ నేతలు వరద బాధితులకు సహాయక చర్యలు అందించిన దాఖలు కనిపించడంలేదు. పైగా, ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటూ కామెడీ చేసి వెళ్ళారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు గేట్లే లేని బుడమేరు వాగు గురించి ‘గేట్లు తెరిచేశారు అడ్డగోలుగా’ అంటూ ఇంకో కామెడీ జగన్ చేయడం చూశాం.

ఇప్పుడేమో, వరద బాధితులు కోటి రూపాయల సాయమంటూ వైసీపీ ఇంకో కామెడీ చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం.. అని వైసీపీ ప్రకటించి వుంటే.. బావుండేది నిజానికి.! కానీ, అది వైసీపీ కదా.!

వైసీపీ విధానాలేంటో రాష్ట్ర ప్రజలకి, అందునా వరద ముంపు బాధితులకు అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, వాలంటీర్ల గురించి మాట్లాడిన జగన్, ఇప్పుడేమో సాయం ప్రకటించి, ఏ రూపంలో అందించాలో పార్టీలో చర్చిస్తామని చెప్పడంతో.. రాష్ట్ర ప్రజానీకం జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.!

సినిమా

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

రాజకీయం

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

ఎక్కువ చదివినవి

కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్‌డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను...

YS Jagan: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..? తీరు మారని జగన్ పరామర్శ!

YS Jagan: "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.." అని సామెత. ఎవరేమనుకున్నా.. సమాజం నవ్వినా.. విమర్శించినా నాకనవసరం అనుకునే తీరు కొందరికే సాధ్యం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని పలకరించడం తప్పుకాదు.. నవ్వుతూ పలకరించడమే పెద్ద...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి,...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్,...

భైరవం నుంచి దమ్ దమారే సాంగ్ రిలీజ్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్...