ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఓ వైరస్ పట్టింది. ఇది కరోనా వైరస్ (కోవిడ్-19) కంటే చాలా భయంకరమైనది. ప్రజల ప్రాణాలెలా పోయినాసరే.. అక్కడి అధికార పార్టీకి మాత్రం రాజకీయాలే కావాలి. ఎక్కడో తెలంగాణలో హెరిటేజ్ సంస్థకు చెందిన ఓ యూనిట్లో సెక్యూరిటీ గార్డుకి కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలితే.. ఏకంగా ఆ ‘యూనిట్’ని మూసెయ్యాలని డిమాండ్ చేసేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేముంటుంది.?
ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తూ రాజ్భవన్లోనే పలువురికి కరోనా వైరస్ సోకింది. నలుగురు రాజ్భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ‘గురివింద గింజ’ తన ‘కింద’నున్న మచ్చని మర్చిపోయి, ఇతరుల మీద ఎగబడిపోవడమంటే ఇదే మరి.!
ఇంత చెత్త రాజకీయం దేశంలో ఇంకెక్కడా లేకపోవడాన్ని ఎలా అనుకోవాలి.? ఆంధ్రప్రదేశ్లో 50కి పైగా కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ‘కాంటాక్ట్’ ఇప్పటిదాకా దొరకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారే చెబుతారు. అంటే, ప్రభుత్వం ఎంత దారుణంగా కరోనా వైరస్ విషయంలో ఫెయిల్ అయ్యిందో ఈ ఒక్క విషయంతోనే అర్థం చేసుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ మీదనో, మరో విపక్షం మీదనో విమర్శలు చేసే సమయంలో పదో వంతు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వుంటే బావుంటుందన్న భావన రాష్ట్ర ప్రజానీకంలోనే కలుగుతోంది. ‘మేం రెండు వైరస్లతో పోరాడుతున్నాం.. ఒకటి కరోనా వైరస్.. ఇంకోటి అంతకన్నా ప్రమాదకరమైన ఎల్లో వైరస్..’ అని మంత్రులు మీడియాకెక్కి నిస్సిగ్గుగా మాట్లాడతారు. ఒకరేమో, ‘చంద్రబాబుకి వయసైపోయింది.. హైద్రాబాద్లోనే ఇంట్లోనే వుండాలి..’ అంటారు. ఇంకొకరేమో, ‘చంద్రబాబుకి హైద్రాబాద్లో వుండడానికి సిగ్గు లేదా.?’ అని ప్రశ్నిస్తారు.
నిజానికి, ఇలా రాజకీయాలు చేయడానికి అధికార పార్టీ నేతలకే సిగ్గుండాలన్నది రాష్ట్ర ప్రజల భావన. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పేశారు. ఆ పార్టీపై అవాకులు చెవాకులు పేలడం వల్ల వైసీపీనే తన స్థాయిని తగ్గించేసుకుంటుంది. ఇక, హెరిటేజ్ విషయానికొస్తే.. చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నది వైసీపీ ఆలోచన. అది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ.
హెరిటేజ్ యూనిట్లో కరోనా పాజిటివ్ తేలాక, అక్కడ ఏం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ, ఈలోగానే వైఎస్సార్సీపీ నేతలకు ‘దురద’ ఆగడంలేదాయె. ‘మేం అడ్డగోలుగా కరోనా పరీక్షలు చేయడంలేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పాక కూడా, ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల్ని ‘అత్యధిక పరీక్షల’ కోణంలో సమర్థించుకుంటున్న వైసీపీ.. నిస్సిగ్గు రాజకీయాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. ప్రజలు తగిన సమయంలో వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయం.
713046 740696That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be confident to maintain writing. 314076
379895 241413This site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will certainly discover it. 766418
726270 61703You got a quite wonderful website, Sword lily I observed it through yahoo. 846048