నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? అన్న చందంగా ఉందని ఏపీ అధికార పార్టీ వైసీపీ తీరు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరిట జనాలకు డబ్బు పంచడం తప్ప.. అభివృద్ధి అనేదే జరగలేదనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ రెండేళ్లలో తాము 64 కంపెనీలతో రూ.30వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం వైసీపీ నేతలకే చెల్లింది.
అన్నింటి కంటే మిన్నగా అనంతరపురంలోని కియా కార్ల పరిశ్రమతోపాటు హీరో, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీలూ తమ చలవేనని చెప్పుకోవడం గమనార్హం. కియా పరిశ్రమ తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే అశోక్ లేలాండ్, హీరోకి సంబంధించి చాలావరకు పనులు టీడీపీ హయాంలోనే జరిగాయి.
కానీ ఇవన్నీ తమ ఘనతేనని, తమ హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించాయని ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి వైసీపీ సర్కారు చెబుతున్న రూ.30వేల కోట్ల పెట్టుబడుల్లో దాదాపు రూ.21 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే.
కానీ వైసీపీ మాత్రం అంతా తమదే క్రెడిట్ అనే రీతిలో ప్రచారం చేసుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. వైసీపీ చెబుతున్న 64 కంపెనీల జాబితా, వాటి ఒప్పంద తేదీలు, అవి పనులు ప్రారంభించిన తేదీలు, ఉత్తత్తి మొదలైన తేదీలు సరిగ్గా ప్రకటిస్తే.. ఎవరి ఘనత ఎంతో తెలిసిపోతుందని అంటున్నారు.
629056 510998As I internet site owner I conceive the content material material here is rattling exceptional , thanks for your efforts. 270494
172143 457979Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging appear simple. The overall look of your site is magnificent, as well as the content! xrumer 237213
471868 828294Respect to post author, some great info . 576564