రాజకీయాలన్నాక నిరసనలు, ఆందోళనలు సర్వసాధారణమే కావొచ్చుగానీ, కోడిగుడ్లతో దాడి చేయడమేంటి.? టమోటాలు విసరడమేంటి.? అన్నిటికీ మించి, పెట్రోల్ బాటిళ్ళు చేత పట్టుకుని ప్రతిపక్ష నేత మీదకు ఎగబడటమేంటి.? ఏదో జరుగుతోంది.! రాజకీయం దారి తప్పుతోంది. రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు ఇంకెలా మారతాయోగానీ, ప్రస్తుతానికైతే అత్యంత అధమ స్థాయికి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందన్నది నిర్వివాదాంశం.
అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తే దాన్ని పెయిడ్ ఉద్యమం అన్నారు. అదే నిజమైతే, మరి విశాఖ విమానాశ్రయం దగ్గర ఈ రోజు జరిగిందేంటి.? ఇదైతే నిఖార్సుగా పెయిడ్ ఆందోళనే. పైగా, అధికార పక్షం అత్యంత వ్యూహాత్మకంగా నడిపిన రాజకీయ నాటకం ఇది. ప్రతిపక్ష నేత మీద అక్కసు అనుకోవాలా.? లేదంటే, ప్రతిపక్ష నేతకు మైలేజ్ తెచ్చే క్రమంలో ఈ యాగీ చేశారనుకోవాలా.? కారణం ఏదైతేనేం.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బ తీసింది. టీడీపీ మాటల్లో చెప్పాలంటే.. రౌడీ రాజకీయాల్ని విశాఖకు తీసుకొచ్చింది అధికార పార్టీ.
విశాఖలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి నీఛ రాజకీయాలు చూడలేదని ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కాదు.. పొలిటికల్ రౌడీయిజంకి, ఫ్యాక్షన్ రాజకీయాలకీ నెలవుగా మార్చుతున్నారనే విమర్శల్ని అధికార పార్టీ ఎదుర్కోవాల్సి వస్తోంది. చంద్రబాబుని అడ్డగించడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తల్లో కసి, కక్ష, కార్పణ్యాలు స్పష్టంగా కన్పించాయి.
చంద్రబాబు మీదకు గుడ్లు, టమోటాలు విసిరే క్రమంలో.. పోలీసులు కూడా ఆ రౌడీ మూకలకు టార్గెట్ అవడం గమనార్హం. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, పెయిడ్ దీక్షలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అచ్చం అదే బాటలో ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలోనూ పెయిడ్ ఉద్యమాలు జరుగుతున్నాయి. అత్యంత హేయంగా రౌడీ మూకల్ని అధికార పార్టీ రంగంలోకి దించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ రోజు జరిగిన సంఘటనలతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ఉలిక్కిపడింది.
722390 989013Extremely informative and great bodily structure of content material material , now thats user friendly (:. 748348