Switch to English

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, వైసీపీకి ఎంత లాభం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘మీరిద్దరూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా మాకేమీ అభ్యంతరం లేదు. మీరిద్దరే కాదు, ముగ్గురూ కలిసి పోటీ చేసినా మాకు ఇబ్బందేమీ లేదు..’ అంటూ అధికార వైసీపీ పదే పదే టీడీపీ, జనసేన, బీజేపీ గురించి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా జనసేన మీదనే వైసీపీ విమర్శలు చేస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం, పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం విదితమే. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓటింగ్, జనసేనకు వచ్చిన ఓటింగుని పరిగణనలోకి తీసుకుంటే, జనసేన విషయంలో నిజంగా వైసీపీ భయపడాల్సిందేమీ లేదు.

జనసేన పార్టీకి ‘కమ్మ’దనం అంటగట్టేందుకు వైసీపీ నానా తంటాలూ పడుతోంది. జనసేనకు ఎవరైనా ‘కాపు’ కాస్తారేమోననీ వైసీపీ ఆందోళన చెందుతోంది. ఇదంతా చాలా తక్కువ ఓటు బ్యాంకు వున్న జనసేన మీద భయంతోనేనా.? కాస్త లోతుగా ఆలోచిస్తే, జనసేన విషయంలో వైసీపీ ఎందుకింతలా భయపడుతోందో అర్థమైపోతుంది.

వైసీపీకి, 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు లభించాయి. వచ్చే ఎన్నికల్లో అంతకు మించి.. అంటే, 57 శాతం ఓట్లు వస్తాయని వైసీపీ నేతలే చెబుతున్నారు. సో, నిజానికి వైసీపీ భయపడాల్సిన పనే లేదు. మిగిలిన 43 శాతం ఓట్లను బీజేపీ, జనసేన.. ఇతర పార్టీలు పంచుకుంటాయని వైసీపీ నమ్మితే.. అసలు విపక్షాల్ని వైసీపీ విమర్శించాల్సిన అవసరం ఏముంది.?

కానీ, అసలు విషయం వేరే వుంది. పైకి వైసీపీ ఏం చెబుతున్నా, తెరవెనుకాల వైసీపీ అధినాయకత్వంలో భయం ఉప్పొంగుతోంది. జనసేన బలపడింది. టీడీపీ 2019 ఎన్నికలతో పోల్చితే పెద్దగా బలపడకపోయినా, జనసేన వల్లనే తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్నది వైసీపీ ఆందోళన.

తాజా అంచనాల ప్రకారం జనసేన పార్టీ బలం 17 శాతం నుంచి 25 శాతానికి పెరిగిందన్నది వైసీపీకి అందిన సమాచారమట. అది కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారా అందిన సమాచారమనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థాయిలో జనసేన బలం పుంజుకుంటే, తొలుత నష్టపోయేది వైసీపీనే. ఆ నష్టం అనూహ్యమైన స్థాయిలో వుంటుందని వైసీపీ భయపడుతోంది.

అందుకే, జనసేన ఒంటరిగా పోటీ చేయాలనీ, టీడీపీ అలాగే బీజేపీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని వైసీపీ పదే పదే కోరుకుంటోంది. అలా జరిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, తమకు 35 శాతం నుంచి 40 ఓట్లు దక్కినా అధికారం నిలబెట్టుకుంటామన్న భావనతో వైసీపీ వుందట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...