Switch to English

పదకొండు ప్రభావం: వైసీపీ.. రాజు లేని రాజ్యమైపోయిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

వై నాట్ 175 అనే నినాదాన్ని నిజానికి, వైసీపీ శ్రేణులే నమ్మలేదు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ప్రజా ప్రతినిథులూ నమ్మలేదు. కానీ, సాధ్యం కాని విషయాన్ని బలంగా రుద్దేందుకోసం ‘సిద్ధం’ అంటూ కోట్లు ఖర్చు చేసి నానా హంగామా సృష్టించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

చివరికి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ.! కనీసం డజను సీట్లు కూడా సాధించలేక బొక్క బోర్లా పడ్డ వైసీపీ, వచ్చే ఐదేళ్ళు ఎలా మనుగడ సాధిస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు బెంగళూరుకి జంప్ అయిపోయారు.

పార్టీ ముఖ్య నేతలకే వైఎస్ జగన్ అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. పొద్దున్న లేస్తే మీడియా ముందర కనిపించే సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా గాయబ్.! ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికల సమయంలో ప్రకటించి, తన వారసుడ్ని రాజకీయాలకు పరిచయం చేసిన పేర్ని నాని, తన వారసుడు కిట్టు కూడా ఓడిపోయేసరికి, చేసేది లేక.. తిరిగి రాజకీయ తెరపై హంగామా చేయాలని చూస్తున్నారు.

ఒకరిద్దరు వైసీపీ నేతలు (వాళ్ళు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో..) మీడియా ముందుకు వస్తున్నారు తప్ప, వైసీపీ ముఖ్య నేతలనదగ్గవారంతా అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోయినట్లే కనిపిస్తోంది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రం షరామామూలుగానే కామెడీ చేసుకుంటూ వెళుతోంది.

వున్నంతలో విజయ సాయి రెడ్డి కాస్త హడావిడి చేస్తోంటే, అది కూడా నవ్వులపాలవుతోంది. అసలు విజయ సాయి రెడ్డి ఎవరి మీద ‘యుద్ధం’ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మీడియా మీద గుస్సా అవుతున్నారు.. కుల మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారు తప్ప, తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన మదన్ మోహన్ అనే వ్యక్తి మీద మాత్రం పరువు నష్టం దావా వేయలేకపోతున్నారు విజయ సాయిరెడ్డి.

ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్నది విజయ సాయి రెడ్డి మీద ఆరోపణ. ఆరోపణ చేసింది కూడా సదరు మహిళకు భర్త అయిన మదన్ మోహన్. ఆ మహిళ వైసీపీ హయాంలో దేవాదాయ శాఖలో కీలక అధికారిగా పని చేశారు.

ఇదిలా వుంటే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కావొచ్చు, మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కావొచ్చు, ఇంకో మాజీ మంత్రి రోజా కావొచ్చు.. ఇలాంటోళ్ళు పెద్దగా మీడియా ముందు కనిపించకపోవడం, వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

వాళ్ళని వదిలేసుకో జగనన్నా.. వీళ్ళని వదిలేసుకో జగనన్నా.. వీళ్ళ వల్లనే పార్టీ నాశనమైపోయింది జగనన్నా.. అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు, ‘నిఖార్సయిన వైసీపీ అభిమానులు’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు.

గ్రామాల్లో వైసీపీ జెండా పట్టుకోవడానికి కూడా కార్యకర్తలు లేని పరిస్థితి వైసీపీకి ఇప్పుడెందుకు వచ్చింది.? అంటే, పోలింగ్ జరిగాక కూడా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘150కి పైగా సీట్లలో గెలుస్తాం’ అని చేసిన ప్రకటన, ఈ క్రమంలో నడిచిన బెట్టింగులు, ఆ బెట్టింగుల్లో సర్వనాశనమైపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఇదీ అసలు విషయం.

అధినేత వైఎస్ జగన్, విరివిగా బెంగళూరుకి వెళ్ళిపోతోంటే, నేతలైనా.. కార్యకర్తలైనా.. పార్టీ వెంట ఎందుకు వుంటారు.? టీడీపీ, జనసేన, బీజేపీ సరిగ్గా పోకస్ పెడితే, పదకొండు రోజులు కూడా అవసరం వుండదు, వైసీపీ సింగిల్ సీటుకి పడిపోవడానికి.. అని వైసీపీ శ్రేణులే సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. అంతలా పతనైపోయింది వైసీపీ.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

నాలుగు వారాల పాటు ప్రభాస్ టూర్.. ఆ విలేజ్ కి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సలార్-2, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి పిలుపు

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)గా పిలిచే...

Ram Charan: సెన్సేషన్..! రామ్ చరణ్ – సందీప్ రెడ్డి కాంబో..!?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందా..? ప్రస్తుతం ఈ వార్త సినీ సర్కిల్స్ లో బాగా వైరల్...

వేట మొదలైంది.. ప్రశాంత్ నీల్ ప్రపంచంలో అడుగు పెడుతున్న టైగర్..

సెన్సేషనల్ కాంబో కలయికకు టైమ్ ఆసన్నం అయింది. సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైంది....

విరూపాక్ష తర్వాత వృష కర్మ..?

విరూపాక్ష సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు తన నెక్స్ట్ సినిమా అక్కినేని హీరో నాగ చైతన్యతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న...