Switch to English

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట ఇది. వైసీపీకి చెందిన చాలామంది నేతలు టీటీడీ ప్రతిపాదించిన భూముల వేలం ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, నిన్న ప్రభుత్వం నుంచీ, టీటీడీ నుంచి ఇంకో ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.

గతంలో.. అంటే, చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలకు సంబంధించి ఇచ్చిన జీవోని రద్దు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ‘అది చంద్రబాబు హయాంలో జరిగిన నిర్ణయం. అప్పటి టీటీడీ పాలక మండలి నిర్ణయం ప్రకారమే భూముల అమ్మకం వ్యవహారం తెరపైకొచ్చింది. ఇంకా వాటిని విక్రయించాలని మేం నిర్ణయమే తీసుకోలేదు..’ అంటూ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా వివరణ ఇచ్చుకున్నారు.

రెండ్రోజుల క్రితం ఒకలా.. ఇప్పుడు ఇంకోలా.. అధికార పార్టీ నేతలు మాట్లాడుతోంటే వినే జనాలకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. ‘ఆ భూముల విలువ చాలా తక్కువ.. అమ్మి, సొమ్ము చేసుకోవాలనే ఆలోచన వుంటే.. చిన్న భూముల విక్రయమెందుకు.? పెద్ద భూముల జోలికి వెళ్ళే అవకాశం వుంటుంది కదా..’ అంటూ అధికార పార్టీ నేతలు ఇప్పుడు నాలిక మడతేసేసి మాట్లాడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

‘వెంకన్న భూముల అమ్మకం’ అనే వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా వున్న రాకేష్‌ సిన్హానే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దరిమిలా.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘రివర్స్‌ గేర్‌’ వేయక తప్పలేదు ఈ విషయంలో. పైగా, విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ, ఆందోళనలకు సిద్ధమయిన వేళ, సొంత పార్టీలోనూ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజే ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పుపట్టారు. మరోపక్క, వైఎస్సార్సీపీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్వామీజీలు సైతం, ‘హిందూ వ్యతిరేక ముద్ర పడుతోంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో.. భూముల విక్రయం నిర్ణయం నుంచి వెనకడుగు వేయాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దానికి మళ్ళీ కవరింగ్‌ ఏంటంటే, ‘చంద్రబాబు హయాంలోనే ఆ ప్రతిపాదన జరిగింది’ అని. చంద్రబాబు అధికారం కోల్పోయి ఏడాది అయ్యింది. ముఖ్యమంత్రి పదవిలోకి వస్తూనే ప్రజా వేదికని కూల్చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, అప్పటి చంద్రబాబు నిర్ణయాల్ని ఎందుకు హుటాహుటిన వెనక్కి తీసుకోలేదు.? ‘చంద్రబాబు వెంకన్న భూముల్ని అమ్ముకున్నారు..’ అని ఆరోపిస్తోన్న వైసీపీ నేతలు, ఆ ఆరోపణల్లో నిజం వుంటే.. తక్షణం చంద్రబాబు మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపించగలగాలి. టీటీడీ అంటే రాజకీయ పునరావాస కేంద్రం.. అన్న భావన ఎప్పుడైతే రాజకీయ పార్టీల్లో తొలగుతుందో.. అప్పటిదాకా వెంకన్న ఆస్తులకు రక్షణ వుండదు. అది వెంకన్న నగలకు సంబంధించి కావొచ్చు.. వెంకన్న భూములకు సంబంధించి కావొచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...