‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట ఇది. వైసీపీకి చెందిన చాలామంది నేతలు టీటీడీ ప్రతిపాదించిన భూముల వేలం ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, నిన్న ప్రభుత్వం నుంచీ, టీటీడీ నుంచి ఇంకో ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.
గతంలో.. అంటే, చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలకు సంబంధించి ఇచ్చిన జీవోని రద్దు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ‘అది చంద్రబాబు హయాంలో జరిగిన నిర్ణయం. అప్పటి టీటీడీ పాలక మండలి నిర్ణయం ప్రకారమే భూముల అమ్మకం వ్యవహారం తెరపైకొచ్చింది. ఇంకా వాటిని విక్రయించాలని మేం నిర్ణయమే తీసుకోలేదు..’ అంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వివరణ ఇచ్చుకున్నారు.
రెండ్రోజుల క్రితం ఒకలా.. ఇప్పుడు ఇంకోలా.. అధికార పార్టీ నేతలు మాట్లాడుతోంటే వినే జనాలకి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ‘ఆ భూముల విలువ చాలా తక్కువ.. అమ్మి, సొమ్ము చేసుకోవాలనే ఆలోచన వుంటే.. చిన్న భూముల విక్రయమెందుకు.? పెద్ద భూముల జోలికి వెళ్ళే అవకాశం వుంటుంది కదా..’ అంటూ అధికార పార్టీ నేతలు ఇప్పుడు నాలిక మడతేసేసి మాట్లాడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘వెంకన్న భూముల అమ్మకం’ అనే వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా వున్న రాకేష్ సిన్హానే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దరిమిలా.. వైఎస్ జగన్ సర్కార్ ‘రివర్స్ గేర్’ వేయక తప్పలేదు ఈ విషయంలో. పైగా, విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ, ఆందోళనలకు సిద్ధమయిన వేళ, సొంత పార్టీలోనూ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజే ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పుపట్టారు. మరోపక్క, వైఎస్సార్సీపీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్వామీజీలు సైతం, ‘హిందూ వ్యతిరేక ముద్ర పడుతోంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో.. భూముల విక్రయం నిర్ణయం నుంచి వెనకడుగు వేయాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దానికి మళ్ళీ కవరింగ్ ఏంటంటే, ‘చంద్రబాబు హయాంలోనే ఆ ప్రతిపాదన జరిగింది’ అని. చంద్రబాబు అధికారం కోల్పోయి ఏడాది అయ్యింది. ముఖ్యమంత్రి పదవిలోకి వస్తూనే ప్రజా వేదికని కూల్చేసిన వైఎస్ జగన్ సర్కార్, అప్పటి చంద్రబాబు నిర్ణయాల్ని ఎందుకు హుటాహుటిన వెనక్కి తీసుకోలేదు.? ‘చంద్రబాబు వెంకన్న భూముల్ని అమ్ముకున్నారు..’ అని ఆరోపిస్తోన్న వైసీపీ నేతలు, ఆ ఆరోపణల్లో నిజం వుంటే.. తక్షణం చంద్రబాబు మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపించగలగాలి. టీటీడీ అంటే రాజకీయ పునరావాస కేంద్రం.. అన్న భావన ఎప్పుడైతే రాజకీయ పార్టీల్లో తొలగుతుందో.. అప్పటిదాకా వెంకన్న ఆస్తులకు రక్షణ వుండదు. అది వెంకన్న నగలకు సంబంధించి కావొచ్చు.. వెంకన్న భూములకు సంబంధించి కావొచ్చు.
884749 988370great day, your internet site is cheap. I do several thanks for succeed 713408
326427 111113Just wanna comment which you have a very good website, I the style and style it actually stands out. 537368
109124 402414Some times its a discomfort inside the ass to read what folks wrote but this site is real user genial ! . 721853
12952 226603Exceptional blog here! Also your internet site loads up quite quickly! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my site loaded up as quickly as yours lol xrumer 626257