జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత ప్రజానీకానికి బాగా తెలుసు. అందుకే, తమకు కష్టం వస్తే, వెంటనే పవన్ కళ్యాణ్కి చెబుతుంటారు బాధితులు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలెదుర్కొంటున్న తెలుగు ప్రజలు తమ సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకెళ్ళారు. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఆయా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. ఇక, తాజాగా పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఓ ‘అప్పీల్’ చేశారు. ‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా.? ఒకసారి వైద్య సిబ్బంది చెబుతున్నది వినండి..’ అన్నది జనసేనాని అప్పీల్ సారాంశం.
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. 160 కేసులకు పైగా ఇప్పటికే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని పరిధిలో అతి పెద్ద ప్రభుత్వాసుపత్రికి చెందిన ముఖ్య వైద్యుడు, తమకు మాస్కుల కొరత వుందనీ, శానిటైజర్స్ కొరత వుందనీ.. దాతలు ఆదుకోవాలని ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
‘కరోనా పట్ల సర్వసన్నద్ధంగా వున్నాం..’ అని చెబుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఏదీ.? ఎక్కడ.? చాలా ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వైద్యులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. వీళ్ళంతా ప్రభుత్వ వైద్యులే కావడం గమనార్హం. ‘మా ప్రాణాల్ని లెక్క చేయకుండా మేం వైద్యం చేస్తున్నాం. మా ప్రాణాల మీద మాకు మక్కువ లేదు. కానీ, మేం ప్రాణాలతో లేకపోతే, వైద్య చికిత్స ఎవరు చేస్తారు.?’ అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే, అధికార పార్టీ అర్థం పర్థం లేకుండా జనసేన పార్టీపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయడం దుర్మార్గమంటూ అధికార పార్టీకి చెందిన నేతలు జనసేనపై చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. జనసేనపై అవాకులు చెవాకులు పేలడం వైసీపీ నేతలకు కొత్త కాదు. కానీ, ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో విపక్షాలు చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకోవడం.. ప్రభుత్వ బాధ్యత.
705715 898295Woh I like your blog posts, saved to fav! . 627946