Switch to English

బీసీలపై విషం చిమ్ముతున్న వైసీపీ..వారికి కేటాయించిన మద్యం షాపులను అడ్డుకునే కుట్ర!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో కల్లు గీత కార్మికులకు 10% దుకాణాలను కేటాయించిన విషయం తెలిసిందే. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 35 పిటిషన్లు హైకోర్టులో దాఖలు అయ్యాయి. వైసీపీ న్యాయవాదులు, తమ సానుభూతిపరులతో ఈ పిటిషన్లు దాఖలు చేయించిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

పిటిషన్లు వేసిన వారిలో కొవ్వూరి వీఆర్ రెడ్డి, పరమేశ్వర్ రావు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కాగా, రఘువీర్, మనోహర్ రెడ్డి, శ్రీమన్నారాయణ, రత్నాంగ ఫణి రెడ్డి తదితరులు వైసిపి సానుభూతి పరులు. ఇక పిటిషన్ దాఖలు చేసిన వారిలో కిరణ్ తిరుమల శెట్టి అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఐశ్వర్య నాగుల వైసీపీ లీగల్ సెల్ లో కీలక మహిళ నేత. వీరితోపాటు వైసీపీ పెద్దల అనుచరులు కూడా పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉండటంతో టీడీపీ నాయకులు చేసిన వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

తమపై మొదటి నుంచి వైసీపీ పక్షపాత ధోరణి చూపిస్తోందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తమకు కేటాయించిన మద్యం షాపులనూ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తమకు 20 శాతం రిజర్వేషన్ ఉండగా.. చంద్రబాబు వచ్చాక దానిని 34% చేశారు. అయితే గత ప్రభుత్వంలో రిజర్వేషన్ శాతాన్ని 24 శాతానికి కుదించారని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేల కల్లు దుకాణాలు మూతపడటం తమపై ఆ పార్టీ చూపిస్తున్న పక్షపాత ధోరణికి సాక్ష్యాలని ఆరోపిస్తున్నారు.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

మెగా–విక్టరీ కాంబోతో పండగ హిట్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు పీక్స్

సంక్రాంతి బరిలోకి దిగుతున్న మెగా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ...

అయ్యా జగన్ గారూ .. ఇప్పుడిప్పుడే దారిన పడే రాజధానిని మళ్ళీ చెడగొట్టడం అవసరమా?!

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం చిమ్మారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కీలక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...