Switch to English

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పిన పరిణామాలతో పాటు 1976లో జలగం వెంగళరావు ప్రభుత్వం ఇచ్చిన జీవో 118, అదే క్రమంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కేసులు, తీర్పులు, 2001 లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో చేపట్టిన అవగాహన కార్యమ్రమాల గురించి తెలుసుకోవాలి. కొల్లేరు ప్రాంతంలో ఏర్పడిన సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించాల్సిన అవసరం అందరి మీద ఉందని జనసేన రాజకీయకార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.

10వ కాంటూరు ప్రకారం 2,25,250 ఎకరాలు కొల్లేరు విస్తీర్ణం కాగా.. 5వ కాంటూరు పరిధిలో 77,138 ఎకరాలు వస్తుంది. 1975లో జలగం వెంగళరావు ప్రభుత్వం 7,200 ఎకరాల్లో చెరువులు తవ్వుకొనేందుకు స్థానిక మత్స్యకారులకు అనుమతి ఇచ్చింది. కాలక్రమంలో 70వేల ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారు. ఆక్రమణలకు గురైన భూమి 56వేల ఎకరాలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

కొల్లేరు పర్యావరణ ధ్వంసం పై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. 1999 లో హైకోర్టు వారు కొల్లేరులో ఆక్వా కల్చర్ ఉండకూడదని.. పట్టా భూముల్లో సైతం సంప్రదాయ చేపల వేట, వ్యవసాయం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొల్లేరు ప్రాంత వాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన, చైతన్యం కలిగించే సదస్సులు నిర్వహించారు. జీవో 120 ఇచ్చి అక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. పర్యావరణాన్ని కాపాడుతూ.. అక్కడ ఉపాది పొందుతున్న మత్స్యకార గ్రామాల ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకున్నారు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ లెక్కలకు అనుగుణంగా 2006లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. కొల్లేరు ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను పరిగణించలేదు.

అక్కడ చేపల వేట, చెరువులప ఆధారపడ్డ మత్స్యకార సంబంధిత కులాలను, వృత్తి ఆధారిత కులాల ఆర్ధిక స్థితిగతులను పట్టించుకోలేదు. నాటు బాంబులు ఉపయోగించి చెరువులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ కొల్లేరులో 25,142 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో సామాన్యులభూముల్లో చెరువులను బాంబులతో ధ్వంసం చేశారు. చిత్తశుద్ధితో చేస్తే ఆ తర్వాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు, మరికొన్ని పార్టీల వారు చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదు. ఇక్కడ దెబ్బ తిన్నది ఎవరు.. సమస్య ఎలా పీట ముడి పడిందో ఆలోచించాలి.

రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు ప్రాంతంలో పర్యావరణాన్ని, జీవ వైవిద్యాన్ని పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. 2017 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొల్లేరు రిహాబిలిటేషన్ పై ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు పర్యావరణం కాపాడుతూనే అక్కడి ప్రజల జీవనోపాధుల రక్షణ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్ తో చర్చించారు.

2019 లో రాష్ట్రంలో పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఏ దశలో కూడా కొల్లేరు ప్రజల జీవనోపాధుల గురించి ఆలోచించలేదు. ఆ పార్టీ అధినేత కొల్లేరుకి పూర్వ వైభవం తెస్తానని ప్రకటనలు చేశారు.

కొల్లేరుకు పూర్వ వైభవం అంటే రాంసార్ కన్వెన్షన్ గుర్తించిన 2,25,000 ఎకరాలకు ఆ సరస్సుని తీసుకురావడమా.. లేదా తండ్రి హాయంలో చేసిన విధంగా నాటు బాంబులతో చెరువులు, భూములు పేల్చడమా అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. 410 కోట్లతో నాలుగు ప్రత్యేక రెగ్యులేటర్లను నిర్మిస్తామని అన్నారు పైసా కూడా ఇవ్వలేదు. ఆయన సంబంధీకులు మాత్రమే అక్కడ చెవులపై గుత్తాధిపత్యం చేశారు. కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంతో వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణం కనిపిస్తాయి.

పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం ఉన్న జనసేన పార్టీ కొల్లేరు వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించింది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులు, నిపుణులు, ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నారు. ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలో కూడా ఇలాంటి చిక్కులే ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్.

ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన అనుభవం సీఎం చంద్రబాబుకి ఉంది. ఆయన నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. కొల్లేరుపై ఆధారపడ్డ వారి జీవనోపాధులను రక్షిస్తూనే, అక్కడి పర్యావరణాన్ని పాకాడే భాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజకీయ ఎత్తుగడలతో బాంబులతో పేల్చేసినా, పూర్వ వైభవం లాంటి పెద్ద మాటలతో మధ్య పెట్టినా సమస్యను క్లిష్టతరం చేసి కొల్లేరు ప్రజల జీవితాలను ఇక్కట్లలోకి నెట్టింది వైఎస్సార్, ఆయన వారసుడి పాలనే. కూటమి పాలనలో అలాంటి రాజకీయ క్రీడలకు తావు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొల్లేరు సమస్యలను తీర్చే బాధ్యత ఉందని జనసే రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ప్రకటించారు.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

డేంజర్‌లో టాప్ కంటెస్టెంట్! బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్‌లో షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ చివరి దశలోకి దూసుకెళ్తుండగా ఓటింగ్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. ఇక షో ముగిసేందుకు మూడు వారాలే ఉండటంతో హౌస్‌లో ప్రతి క్షణం టెన్షన్‌ఫుల్‌గా మారింది. మిగిలిన...

BIGG BOSS 9 TELUGU E89: తొలి ఫైనలిస్ట్ కోసం దుమ్ము రేపిన టాస్కులు, ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ సీజన్ 9 గురువారం ఎపిసోడ్ 89 లో  ఇంట్లో అల్లరి, ఆగ్రహం, డ్రామా, పోటీ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి. తొలి ఫైనలిస్ట్‌ కోసం జరిగిన ఛాలెంజ్‌లు సభ్యుల సామర్థ్యాన్నీ, సహనాన్నీ...

Daily Horoscope: డిసెంబర్ 3, 2025 – బుధవారం రాశిఫలాలు

మేష (Aries): పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సహచరుల నుండి మంచివార్తలు అందుతాయి. కుటుంబంలో చిన్న విషయాలు సౌఖ్యం కలిగిస్తాయి. ధన వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ప్రయాణాల్లో చిన్న ఆలస్యాలు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్యంలో...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల షాక్!

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లు  వారు తెలిపారు....

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. సామజవరగమన సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయంతో...