‘వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది చంద్రబాబే..’ అంటూ వైసీపీ నేతలు, గతంలో తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.. అదీ ప్రతిపక్షంలో వున్నప్పుడు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు మీద కేసులు పెట్టడానికి మాత్రం వైసీపీలో ఎవరికీ ధైర్యం సరిపోలేదు.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా.
‘సొంత బాబాయ్ని రాజకీయ అవసరాల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంపించేశారు..’ అని ఆరోపించిన టీడీపీ నేతలదీ అదే పరిస్థితి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబుకీ మనసొప్పలేదు. రాజకీయాలంటేనే అంత.
ఇప్పుడిక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక నిందితుడు దస్తగిరి కన్ఫెషన్.. అంటూ మీడియాలో ఓ బ్రేకింగ్ న్యూస్ బీభత్సంగా సందడి చేసేస్తోంది. దస్తగిరి ఆగస్ట్ నెలాఖరున ఈ స్టేట్మెంట్ ఇవ్వగా, దాన్ని సీబీఐ ఈ రోజు న్యాయవాదులకు ఇవ్వడంతో అందులో అంశాలు వెలుగు చూశాయి. అవేంటన్నది వేరే చర్చ.
అసలు వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ వీడుతుందా.? లేదా.? ఇదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. ఎందుకంటే, రాజకీయాల్లో ఇలాంటి చాలా మిస్టరీలు.. ఎప్పటికీ వీడవు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపారు.? అందరికీ తెలిసిన విషయం ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని.
అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక కుట్ర వుందనే అనుమానాల్ని సాక్షాత్తూ వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ వ్యక్తం చేశారు. మరి, ఆ దిశగా ‘గట్టి విచారణను’ ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
వైఎస్సార్ విషయంలోనే అలా జరిగితే, వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ వీడుతుందని ఎలా అనుకోగలం.? ఇదిగో పులి.. అదిగో తోక.. అంటూ అటు రాజకీయం, ఇటు మీడియా హడావిడి చేయడం తప్ప.. అసలు దోషులు దొరికే ప్రసక్తే వుండకపోవచ్చు.
551763 928278I genuinely prize your work , Excellent post. 133110
87796 967034Woh I like your content , saved to favorites ! . 757927