Switch to English

కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ ‘ఫేక్’ లెటర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,968FansLike
57,764FollowersFollow

వైసీపీకి, ఆ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకీ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది.! అక్రమాస్తుల పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ వ్యవహారమని విజయమ్మ, షర్మిల చెబుతోంటే.. కాదు కాదు, ఇది రాజకీయ వ్యవహారం.. అన్నట్లుగా వైసీపీ నుంచి ఆ మధ్య ఓ లేఖ వచ్చింది.

అసలు ఆస్తులా.? అక్రమాస్తులా.? అన్నదానిపై పెద్ద డిబేట్ జన బాహుళ్యంలో నడుస్తోంది. 200 కోట్ల డివిడెండ్ షర్మిలకు ఇచ్చినట్లుగా ప్రకటించి వైఎస్ జగన్, సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఆ లెక్కన ఆస్తులు వందల కోట్లు కాదు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు అయి వుంటుందన్నది జనం డిసైడ్ అయిన అంశం.

ఇక, 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి దూరమయ్యారు విజయమ్మ. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికీ ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ విజయమ్మ ఏపీ రాజకీయాలు వదిలి, తెలంగాణకు పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం షర్మిల తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చార్లెండి.

ఇదిలా వుంటే, కొన్నాళ్ళ క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కొత్త కారు టైర్లు పేలిపోయాయ్. దీన్ని కుట్రగా అప్పట్లో చాలామంది అనుమానించారు. కొత్త కారు టైర్లు పేలిపోవడమేంటి.? అవును కదా.! ఆస్తుల పంపకాల నేపథ్యంలోనే ఇదంతా జరిగిందన్నది చాలామంది అనుమానం.

ఇప్పుడు నడుస్తున్న ఆస్తుల గొడవకీ, ఆ ప్రమాదానికీ లింకు పెట్టి, వార్తలు.. కొన్ని అదనపు హంగులతో కూడిన వార్తలూ బయటకు వస్తున్నాయ్. ఈ వ్యవహారాలు వైసీపీ మెడకి గట్టిగానే చుట్టుకున్నాయ్. దాంతో, వైసీపీ వ్యూహాత్మకంగా విజయమ్మ పేరుతో ఓ లేఖ రాసింది. ఆ ప్రమాదానికీ, తన కొడుక్కీ సంబంధం లేదన్నట్లుగా విజయమ్మ రాసిన లేఖలా వుందది.

కానీ, అందులో విజయమ్మ సంతకం ఫోర్జరీ అయ్యిందనే అనుమానాలు వైసీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయ్. వెంటనే వైసీపీ, ఆ లేఖని తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తొలగించింది. ఇది ఇంకో పెద్ద సెల్ఫ్ గోల్ అయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

వైసీపీ అంటేనే ఫేక్, ఫేక్ అంటేనే వైసీపీ.. అని ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంటూ వైసీపీ మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్నప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలీ ఆస్తుల పంచాయితీలు ఎందుకు.? తల్లికీ, చెల్లికీ అక్రమాస్తుల విషయంలో సెటిల్మెంట్ చేసెయ్యొచ్చు కదా.? అన్నది వైసీపీ శ్రేణుల వాదన.

వైసీపీ శ్రేణులే, దీన్ని అక్రమాస్తుల వ్యవహారం.. అని అభివర్ణిస్తున్న పరిస్థితి వచ్చిందంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే భావించాల్సి వుంటుంది. అయినాసరే, ‘తగ్గేదే లే..’ అని జగన్ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

ఇంతకీ, ఈ ఫేక్ లెటర్ విషయమై వైఎస్ విజయమ్మ స్పందిస్తారా.? తన తల్లికి తృటిలో తప్పిన కారు ప్రమాదంపై వైఎస్ షర్మిల వాదన ఏంటి.? దీనిపై ఇంకో లేఖ వైఎస్ షర్మిల నుంచి వస్తే, వైసీపీ పరిస్థితి ఏంటి.? వైఎస్ జగన్, బెంగళూరు నుంచి తిరిగొస్తే.. అప్పుడు మళ్ళీ ఈ వ్యవహారంపై స్పష్టత వస్తుందేమో.!

1 COMMENT

సినిమా

BIGG BOSS 9 TELUGU E87: ఫైనలిస్ట్ ల పోటీలో చతికిల...

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా ఫైనలిస్ట్ రేస్ హంగామాతో సందడి చేసింది. గ్రాండ్ ఫి నాలే దగ్గరపడుతుండడంతో హౌస్‌లోని ప్రతి సభ్యుడు...

“ఆంధ్ర కింగ్ తాలూకా” కి ప్రేక్షకులు, రివ్యూవర్స్ ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతం:...

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థియేటర్స్‌లో దుమ్మురేపుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ నవంబర్ 27న విడుదలైనప్పటి నుంచి హౌస్‌ఫుల్ షోలను...

యధార్థ సంఘటనల ఆధారంగా “విధాత”.. త్వరలో.

విధాత సినిమా తొలి కాపీ సిద్ధమైంది. Abc ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం వహించగా, నిర్మాతగా అప్పిని పల్లె...

హైదరాబాద్‌కి కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్… ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం...

న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌...

BIGG BOSS 9 TELUGU E86: ఎమోషన్‌తో పాటు అగ్నిలా మండిన...

బిగ్ బాస్ సీజన్ 9 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఎమోషన్, అండ్ పక్కా మసాలాతో నిండిపోయింది. సాధారణ నామినేషన్స్ అనుకున్న ఇంటి సభ్యులు… ఈ...

రాజకీయం

పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం, క్షమాపణలు కోరుతూ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షా కు వివరించిన లోకేష్–అనిత

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మొంథా తుపాను భారీ నష్టాన్ని మిగిల్చిందని మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదికతో వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ...

ఢిల్లీ పర్యటనలో లోకేష్, అనిత – కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఢిల్లీకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మరియు హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని...

పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ స్నేహం.! రాష్ట్రం కోసమేనన్న చంద్రబాబు.!

ఎన్డీయే కూటమి పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో వుండాలని పదే పదే ఆకాంక్షిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి...

ఎక్కువ చదివినవి

“మారిపోతా సార్”… కస్టడీలో ఐబొమ్మ రవి ప్రాధేయన

ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌ను సంవత్సరాల పాటు నడిపిన రవి ఇప్పుడు విచారణలో పోలీసుల ముందు మనసు విప్పినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల పాటు ఎవరూ తనను...

తెలంగాణలో జనసేన బలోపేతం – ఉత్సాహంగా జనశ్రేణుల సమావేశం

హైదరాబాద్ రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన తెలంగాణ జనశ్రేణుల విస్తృతస్థాయి సమావేశం జనసేన కార్యకర్తలతో సందడి చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ బి....

బ్రేకింగ్: ఏపీలో మూడు కొత్త జోన్లు: విశాఖ–అమరావతి–రాయలసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని మూడు ప్రధాన జోన్లుగా విభజిస్తూ— విశాఖ జోన్, అమరావతి జోన్, రాయలసీమ జోన్ — ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....

మెగాస్టార్ గ్రేస్ తో ‘శశిరేఖ’ సాంగ్ త్వరలో..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో ఉన్న ‘శశిరేఖ’ పాట త్వరలో విడుదల కానుంది. కేరళలో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ సాంగ్‌లో చిరు ఎంతో గ్రేస్‌తో, క్లాస్‌గా...

తిరుపతిలో నకిలీ సీఐ హల్‌చల్… శివయ్య బాగోతం బట్టబయల్!

తిరుపతి జిల్లాలో నకిలీ సీఐ శివయ్య చేస్తున్న హడావిడి పెద్ద సెన్సేషన్‌గా మారింది. రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సీఐగా పనిచేస్తున్నానంటూ పెద్దగా వేషాలు వేసిన శివయ్య, చినగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లిలో ఓ...