Switch to English

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు. నేడు మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్థంతి సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి సునీత, కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో స్పీడ్ గా విచారణ సాగట్లేదని.. నేరస్తులకు శిక్ష పడట్లేదని వాపోయారు.

ఈ కేసులో సాక్ష్యులు చనిపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్ష్యులను ప్రభుత్వం కాపాడాలని.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా నిందితులకు శిక్షలు విధించాలంటూ ఆమె కోరారు. నిందితులు డబ్బు, పలుకుబడితో సాక్ష్యులను ప్రేరేపిస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. సీబీఐ విచారణ ఇంకా వేగం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నా సరే నిందితులకు ఇంకా శిక్షలు పడకపోవడం చాలా బాధాకరం అని ఆమె చెప్పుకొచ్చారు. వివేకానందరెడ్డి ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని.. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు కూడా వివేకా సమాధి వద్ద నివాళి అర్పించారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్షలు విధించినప్పుడే తన తండ్రికి అసలైన ఆత్మశాంతి కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఆరేళ్ల కాలంలో తనపై ఎంతో మంది ఒత్తిడి చేసినా వెనకడుగు వేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినా కూడా కేసులో ఇంకా నిజాలు తేలకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. తాను ఏ పార్టీకి మద్దతు పలకట్లేదని.. తండ్రికి న్యాయం జరిగితే అదే చాలు అంటూ తెలిపారు. సునీత ఇప్పటికే రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిశారు.

తండ్రి హత్య కేసులో నిజాలు తేల్చాలంటూ కోరారు. కూటమి ప్రభుత్వం కూడా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేసింది. అలాగే సునీత కుటుంబానికి రక్షణ కల్పిస్తామంటూ కూడా చెప్పింది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్వయంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో కడప రాజకీయాల్లో వివేకా హత్య చాలా ప్రభావం చూపించింది. మరి ఈ కేసులో ఇంకా ఎంత మంది అరెస్ట్ అవుతారో చూడాలి.

సినిమా

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా విషెస్ తెలిపారు. 'అనితర సాధ్యుడు...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 18 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 18-04-2025, శుక్రవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ పంచమి మ. 1.11 వరకు,...

చంద్రబాబు పుట్టినరోజు.. తిరుమలలో 750 కొబ్బరికాయల మొక్కు..!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తిరుమలలో 750 కొబ్బరికాయలు కొట్టి, 7 కేజీల 500 గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 23 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 23-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ 11.50 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 22 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 22-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ నవమి మ 1.03 వరకు,...