రాఖీ పండగ సందర్భంగా రాష్ట్రంలోని బాలికలు, మహిళల భద్రత కోసం రూపొందించిన ‘ఈ-రక్షాబంధన్’ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
‘మహిళా సాధికారికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్కూల్స్, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజుల పాటు వెబినార్స్ ద్వారా శిక్షణ ఇస్తాం. ఆగష్టు 3నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలో షార్ట్ ఫిలింస్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా కార్యక్రమాలు ఉంటాయి. మహిళలకు సమస్య వస్తే దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. అన్ని రంగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. 30లక్షల మంది మహిళలకు త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. బెల్టు షాపులను రద్దు చేశాం. 33శాతం వైన్ షాపులు తగ్గించాం’ అని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు సీఎం జగన్ కు రాఖీ కట్టారు.
471004 514701Can I just say what a relief to search out somebody who actually is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a difficulty to light and make it essential. Extra folks require to learn this and perceive this facet with the story. I cant consider youre no more common because you positively have the gift. 443941