Switch to English

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఆశాభావం.. ఇదేం రాజకీయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ‘చేతులెత్తేసిన వైనాన్ని’ స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రత్యేక హోదా వస్తుందని ఆశ.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి పార్లమెంటులో పూర్తి మెజార్టీ వుంది గనుక, కేంద్రాన్ని డిమాండ్‌ చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సెలవిచ్చారు.

‘మన పాలన – మీ సూచన’ పేరుతో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన వైఎస్‌ జగన్‌, ప్రత్యేక హోదా వచ్చి వుంటే, రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి జరిగి వుండేదని అభిప్రాయపడ్డారు. మరోపక్క, పారిశ్రామికవేత్తలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించారు. చివరి ఏడాదిలో మాత్రం ప్రత్యేక హోదా కోసం ఆయన ఉద్యమించేశారు. ఇదే ప్రత్యేక హోదా కోసం గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది.

అప్పుడూ, ఇప్పుడూ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వుంది. అప్పుడెందుకు వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడింది.? ఇప్పుడెందుకు ‘వేచి చూస్తాం.. అంతకన్నా చేయడానికేముంది.?’ అని ఎందుకు అంటోంది.? ప్రత్యేక హోదా అంటే, కేవలం.. అది రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికే.. అన్న విషయం వైసీపీ తాజా చర్యలతో నిరూపితమవుతోంది.

గతంలో వైఎస్సార్సీపీ, రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం బంద్‌లు నిర్వహించిన విషయాన్ని కూడా చూశాం. ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత హోదాలో ఆమరణ నిరాహార దీక్షకూ దిగారు. అప్పట్లో కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి, చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. అదంతా ప్రత్యేక హోదా మీద ప్రేమ కాదు, చంద్రబాబు మీద రాజకీయంగా పై చేయి సాధించడం కోసమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

మొత్తమ్మీద, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలతో మరో మారు ప్రత్యేక హోదా అంశం తెరపైకొచ్చినా.. అది దాదాపుగా ఇకపై కాలగర్భంలో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, ఇంకో నాలుగేళ్ళు కేంద్రంలో బీజేపీనే అధికారంలో వుంటుంది. ఆ బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ వుంది. అప్పటిదాకా ఏదో మొహమాటానికి కేంద్రాన్ని వైసీపీ, ప్రత్యేక హోదా అడుదుతుందంతే. కేంద్రాన్ని నిలదీసే సాహసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం చెయ్యదుగాక చెయ్యదు. ఇది క్లియర్‌.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...