ఇప్పటికే జగనన్న కాలనీలు నిర్మిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం జగనన్న స్మార్ట్ టౌన్స్ నిర్మించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీపంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లోని ఎంఐజీ లే అవుట్ను ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ ఫ్లాట్లు ఉండబోతున్నాయి. రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే ఈ ఫ్లాట్లు పొందేందుకు అర్హులని తెలుస్తోంది. తొలి దశలో అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాకో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతో జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూసమీకరణ పథకం కింద అసైన్డ్ భూములను రైతులు, ప్రజల నుంచి తీసుకోనున్నారు.
864613 712633Will you care and attention essentially write-up most of the following in my webpage in essence your site mention of this blog? 302150
459927 560083Right after study a number of the websites together with your site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls have a appear at my web page likewise and let me know in the event you agree. 831910