Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: వీళ్ళకి కోటి.. వాళ్ళకు 25 లక్షలు మాత్రమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతి చెందినవారికి కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నవారికీ ఎక్స్‌గ్రేషియా పెద్ద మొత్తంలోనే ప్రకటించారు. ఇది కాక, ‘ఎఫెక్టెడ్‌ ఏరియా’లో వున్న 15,000 మందికి ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అభినందించాల్సిన విషయమే ఇది.

కానీ, గోదావరి నదిలో చోటు చేసుకున్న బోటు ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబాలకు 25 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడమేంటి.? అన్న చర్చ తెరపైకొచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు పోస్టింగ్స్‌ దర్శనమిస్తున్నాయి.

విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి తీరాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న పర్యాటక బోటు ప్రమాదానికి గురై పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఇదే కోటి రూపాయలు పరిహారం ఇచ్చి తీరాలి కదా.!

గతంలో చంద్రబాబు హయాంలో బోటు ప్రమాదం జరిగితే 50 లక్షల పరిహారం డిమాండ్‌ చేసిన ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక మాత్రం ఎక్స్‌గ్రేషియా విషయంలో ‘పీనాసితనం’ ఎందుకు ప్రదర్శించారన్నది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న.

మరోపక్క, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థతో అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా వుండే ఓ వ్యక్తికి సంబంధాలున్నాయంటూ కొన్ని వార్తా కథనాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌, హుటాహుటిన విశాఖ వెళ్ళడం బాధితుల్ని పరామర్శించడం అభినందనీయమే అయినా, అప్పుడు గోదావరి దుర్ఘటనలో చూపించని ఉత్సాహం.. ఇప్పుడెందుకు ఆయన చూపారంటూ సోషల్‌ మీడియా వేదికగా దూసుకొస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ ఏం సమాధానమిస్తుందో ఏమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...