Switch to English

ఏపీలో బియ్యం డోర్‌ డెలివరీ.. అదిరిందయ్యా జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ప్రజలకు మేలు కలిగే ఏ చర్యలు ప్రభుత్వం తీసుకున్నా అభినందించి తీరాల్సిందే. రేషన్‌ దుకాణాలంటే అవినీతికి, దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌ అనే అభిప్రాయాలు ఇప్పటికీ వున్నాయి. అంతెందుకు, ఈ మధ్యనే రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిన వైనం విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. అధికార పార్టీ ఎంపీనే ఈ విషయమై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఎంపీగారికి చెందిన ట్రస్ట్‌కి రేషన్‌ బియ్యం తరలి వెళుతున్న వ్యవహారం బట్టబయలయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం రేషన్‌ బియ్యం విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్‌ బియ్యాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి డోర్‌ డెలివరీ చేయనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోబోతోంది. ప్రత్యేకంగా తయారు చేసిన సంచులతోపాటు, బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు అనుగుణంగా ఓ ప్రత్యేక వాహనాన్నీ అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తం 13,370 మొబైల్‌ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయనుంది ప్రజా పంపిణీ వ్వవస్థ.

లబ్దిదారుల ముందే బస్తా సీల్‌ని ఓపెన్‌ చేసి, వారికి నిర్దేశించిన కోటా ప్రకారం ఈ కొత్త విధానం ద్వారా అందించనున్నారట. నిజంగానే అభినందించాల్సిన విషయమిది. అయితే, నాణ్యమైన బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి వుంటే బావుండేది. ఈ నాణ్యమైన బియ్యం – సన్నబియ్యం చుట్టూ నానా యాగీ జరుగుతున్న విషయం విదితమే.

వైఎస్‌ జగన్‌, ఎన్నికల ప్రచారంలో ‘సన్నబియ్యం’ ప్రస్తావన తీసుకురాగా, అదంతా ఉత్తదేనని ఆ తర్వాత అదే వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి అయ్యాక బుకాయించారు. ఆఖరికి తన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కథనాల్నీ తప్పుడు కథనాలుగా కొట్టి పారేశారు వైఎస్‌ జగన్‌.

ఏదిఏమైనా, ప్రజా పంపిణీకి సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేయగలిగితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, రేషన్‌ బియ్యాన్ని నమ్ముకున్న రాజకీయ పందికొక్కులు ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాయా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...