Switch to English

ప్రెస్ మీట్‌కి కొత్త అర్థం చెప్పిన వైఎస్ జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,980FansLike
57,764FollowersFollow

ప్రెస్ మీట్ అంటే ఏంటి.? జర్నలిస్టులు వుంటారు.. ప్రశ్నలు అడుగుతారు. వాటికి ప్రెస్ మీట్ పెట్టిన నాయకుడు సమాధానం చెప్పాలి.! ఏ అంశం మీదన ప్రెస్ మీట్ పెడుతున్నదీ, ముందే చెప్పాలి. అప్పటికి, ప్రస్తావనకు వచ్చిన అంశాలు, ఇతరత్రా విషయాలపై మీడియా, ఆయా రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తుంటుంది. ప్రెస్ మీట్ అంటే ఇదే.!

కానీ, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే ప్రెస్ మీట్లు చిత్రంగా వుంటాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్ మీట్ కోసం ఏర్పాట్లు. కొన్ని పేపర్లు చేత్తో పట్టుకుని కూర్చునే వైఎస్ జగన్. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. కాదు, చదివేస్తారు.

ఇంతకీ, జర్నలిస్టుల పనేంటి.? కూర్చుని, విని వెళ్ళిపోవాలి. ఎంపిక చేసిన పాత్రికేయులు మాత్రమే వెళతారు. తమ వెంట కెమెరాలు తీసుకెళ్ళడానికి వారికి అనుమతి వుండదు. ఆ తర్వాత సంబంధిత వీడియో విడుదల చేస్తారు. ఇదీ తంతు.!

కలియుగ ప్రతక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందన్నది ఆరోపణ. అందులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని వాడి, కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాల్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి.

కానీ, చంద్రబాబు వంద రోజుల పాలన గురించి మాట్లాడారు వైఎస్ జగన్, ప్రెస్ మీట్ పెట్టి. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ‘సూపర్ స్వామి’గా అభివర్ణించారాయన. ఇదా పద్ధతి.? అదే వైవీ సుబ్బారెడ్డి సతీమణి, ఓ సందర్భంలో ‘జగన్ రెడ్డి రక్షక గోవిందా’ అంటూ గోవింద నామాల్ని మార్చి చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలిక్కడ.

వైసీపీ హయాంలో, అంతర్వేది రధం తగలబడింది.. అదే వైసీపీ హయాంలో, రామతీర్థం కొండపై రాములోరి విగ్రహం తల నరికారు దుండగులు. వైసీపీ హయాంలో చాలా దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ‘విరిగింది ఆంజనేయస్వామి బొమ్మ తాలూకు చెయ్యే కదా.?’ అంటూ తేలిగ్గా మాట్లాడారు అప్పట్లో ఓ వైసీపీ మంత్రి.

చెప్పుకుంటూ పోతే, విషయం చాలా పెద్దది. చాలా చాలా పెద్దది.! హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీస్తూ, వినాయక చవితి సమయంలో విగ్రహాలకు వైసీపీ రంగులు పూసిన సందర్భాలున్నాయి. దేవాలయాల ముందర ఆ దేవాలయాలు కనిపించకుండా, వైసీపీ జెండాలు కట్టిన దాఖలాలు చాలానే. ఇంత వైపరీత్యం వైసీపీ హయాంలో జరిగింది.

వీటన్నిటినీ అడ్రస్ చేయకుండా, ప్రాక్టీస్ చేసుకొచ్చిన మాటల్ని చదివేసి, ప్రెస్ మీట్ అయిపోయిందనిపించేశారు వైఎస్ జగన్. ఇదేం ప్రెస్ మీట్.? దేశవ్యాప్తంగా హిందువులు వైసీపీని తప్పు పడుతున్నారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు. తప్పించుకు తిరిగితే సరిపోదు.. యావత్ హిందూ సమాజం, తిరుపతి లడ్డూ విషయమై జగన్ నుంచి సమాధానాన్ని, క్షమాపణనీ డిమాండ్ చేస్తోంది.

సినిమా

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. కావాలనే లీక్ చేశారా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ...

అన్షుపై అనుచిత కామెంట్స్.. త్రినాథరావు క్షమాపణలు..!

హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాంతో డైరెక్టర్ త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. ఓ...

డాకు మహారాజ్ రికార్డు.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..?

బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ జనవరి 12న తొలిరోజు కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా...

డైరెక్టర్ త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్.. త్వరలోనే నోటీసులు..!

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై చేసిన అనుచిత కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి....

నారావారి పల్లెలో సంక్రాంతి సంబురాలు.. మహిళలకు భువనేశ్వరి కానుకలు..!

చంద్రబాబు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సంక్రాంతి పండుగ. దీంతో చంద్రబాబు కుటుంబం చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో...

రాజకీయం

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

ఎక్కువ చదివినవి

Breaking: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. తోపులాటలో నలుగురు భక్తులు మృతి!

తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని టీటీడీ వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10,11,12 రోజులకు గానూ దర్శన టోకెన్ల...

తెలుగు సినిమాకి ఈ సంక్రాంతి నేర్పిన గుణపాఠమిదే.!

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయనగానే.. తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ ఇప్పటికే విడుదల కాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

తిరుపతి ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 6 కు చేరుకుంది. వివిధ కేంద్రాల్లో తొక్కిసలాట చోటు చేసుకోగా వారిని రుయా, స్విమ్స్...