Switch to English

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. మొత్తం బోల్తా కొట్టిందిగా??

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వేళా విశేషమేమో లేక మరొకటో కానీ ఏపీ సీఎం జగన్ కు కాలం అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించటం లేదు. తన మదిలో ఉన్న ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు ఒక అడుగు ముందుకు వేస్తోంటే నాలుగు అడుగులు వెనక్కిలాగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. జగన్ వీలైనంత త్వరగా ఘటనపై స్పందించి భారీ సాయాన్ని బాధితుల కుటుంబాలకు ప్రకటించగానే ప్రమాదంకారణంగా ఏర్పడిన తీవ్ర పరిస్థితులు చల్లారతాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ తానొకటి అనుకుంటే వైజాగ్ ఇంకొకటనుకుంటున్నట్లు గ్యాస్ ప్రమాద బాధితులంతా రోడ్డెక్కారు. తమవారి మృతదేహాలను కంపెనీముందు పెట్టి దాన్ని మూసేయాలని ఆందోళన చేశారు..

ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టులు కూడా జరిగాయి. అయితే ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయకుండా న్యాయం అడిగిన మమ్మల్ని అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వ తీరుపై బాధితులు గుర్రుమంటున్నారు. మీరిచ్చిన కోటి రూపాయలతో తమవారు తిరిగి వస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో విపత్తులు, ప్రమాదాల వంటివి సంభవించినపుడు వ్యవహరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి, బాధితులకు మధ్య గ్యాప్ వస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సైతం వెళ్లామా.? వచ్చామా.? అన్నట్లుగా ఉందే తప్ప పరిస్థితులు సద్దుమణిగేవరకూ ఆయన అక్కడే ఉండి ఉంటే బాగుండేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కంపెనీ ప్రతినిధుల కోసం వైజాగ్ వెళ్లారా.? లేక బాధితుల్ని పరామర్శించటానికి వెళ్లారా అని విపక్షాలు కూడా జగన్ కు నేరుగా గురిపెట్టాయి. ఇంకో అడుగుముందుకేసి అసలు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిలా ఫీలయ్యే సాయిరెడ్డి ఎందుకు కనిపించటంలేదంటూ విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. మూడురోజులుగా సాయిరెడ్డి ఎందుకు మొఖం చాటేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు తక్షణమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలనీ, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి మాజీ సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఎన్జీటీ, హైకోర్టు, ఎన్ హెచార్సీ లు సుమోటోగా ఘటనను తీసుకున్నాయనీ కేంద్రం సైతం పరిశ్రమల తీరుపై మానిటరింగ్ చేయాలంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్టుగా ప్రభుత్వం పడిన శ్రమ అంతా విమర్శల వరదలో కొట్టుకుపోతోంది. మరి ఈ ప్రమాదానికి కారకులను కటకటాలలోకి నెట్టేవరకూ ఈ ఎపిసోడ్ అయితే ఓ కొలిక్కివచ్చేట్లు కనిపించటం లేదు..మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...