‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా అంశమే కీలక పాత్ర పోషించింది. 2019 ఎన్నికల్లోనూ ఈ అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వైఎస్సార్సీపీకి మద్దతుగా పొరుగు రాష్ట్రం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కూడా ‘ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే మేం అడ్డుకోం..’ అని చెప్పిన విషయం విదితమే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు.. కానీ, ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (అధికారంలోకి వచ్చాక) ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడింది లేదు. కేంద్రానికి రిప్రెజెంటేషన్ ఇచ్చి వూరుకున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అడగడం మినహా ఏమీ చేయలేం..’ అని గతంలోనే తేల్చేశారు. ఇక, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ మాట్లాడటమే లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో, ఆంధ్రప్రదేశ్కి దక్కిన రెండే రెండు అతిపెద్ద ‘వరాలు’ – ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం. వీటి తర్వాత వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ, పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్.. ఇలాంటివన్నీ వున్నాయనుకోండి.. అది వేరే విషయం.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటితమయ్యిందిగానీ, ఆ జోన్కి సంబంధించిన పనులు ఇప్పటిదాకా పూర్తి కాలేదు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు ఏ స్థాయిలో వుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. పోలవరం సంగతి సరే సరి. జాతీయ విద్యా సంస్థలకు తగిన కేటాయింపులు లేక, ఆయా విద్యా సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి, ఈ అంశాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంది. కానీ, కేంద్రంతో తెరవెనుకాల సఖ్యత ఎక్కడ చెడిపోతుందోనన్న కోణంలో వైసీపీ మిన్నకుంటోంది.. అది రాష్ట్రం పాలిట శాపంగా మారుతోంది.
‘చంద్రబాబు హయాంలోనే కాస్త బెటర్.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విద్యా సంస్థనో, ఇంకొకటో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది..’ అన్న భావన ప్రజల్లో పెరుగుతోందంటే, అది వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి వస్తుంది. ఇక, ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏకంగా నిరాహార దీక్షలే చేశారు. ఇప్పుడు ఆ తరహా దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. తమ ఎంపీలతో ఢిల్లీలో నిరసనలు, నినాదాలు చేయిస్తే సరిపోతుంది. కానీ, ఆ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసపాటి కార్యక్రమాలు కూడా చేయకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
కేంద్రం కాదు, ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీలే పాతరేసేశాయ్.. అందులో టీడీపీ, వైసీపీ.. దొందూ దొందే.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
448522 277036Keep up the amazing piece of work, I read few posts on this internet internet site and I believe that your weblog is really interesting and holds bands of wonderful information. 777254
558407 431160cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id really like to add them to my reader 847365
336662 285801Rapidly and easily build your internet traffic and PR, which provides Web web site visitors to add your page to any social bookmarking site. 432776
612630 115461Really intriguing information !Perfect just what I was looking for! 252840