Switch to English

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా అంశమే కీలక పాత్ర పోషించింది. 2019 ఎన్నికల్లోనూ ఈ అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వైఎస్సార్సీపీకి మద్దతుగా పొరుగు రాష్ట్రం తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ కూడా ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే మేం అడ్డుకోం..’ అని చెప్పిన విషయం విదితమే.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు.. కానీ, ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (అధికారంలోకి వచ్చాక) ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడింది లేదు. కేంద్రానికి రిప్రెజెంటేషన్‌ ఇచ్చి వూరుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అడగడం మినహా ఏమీ చేయలేం..’ అని గతంలోనే తేల్చేశారు. ఇక, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలెవరూ మాట్లాడటమే లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో, ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన రెండే రెండు అతిపెద్ద ‘వరాలు’ – ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం. వీటి తర్వాత వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ, పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌.. ఇలాంటివన్నీ వున్నాయనుకోండి.. అది వేరే విషయం.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటితమయ్యిందిగానీ, ఆ జోన్‌కి సంబంధించిన పనులు ఇప్పటిదాకా పూర్తి కాలేదు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు ఏ స్థాయిలో వుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. పోలవరం సంగతి సరే సరి. జాతీయ విద్యా సంస్థలకు తగిన కేటాయింపులు లేక, ఆయా విద్యా సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిజానికి, ఈ అంశాలపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంది. కానీ, కేంద్రంతో తెరవెనుకాల సఖ్యత ఎక్కడ చెడిపోతుందోనన్న కోణంలో వైసీపీ మిన్నకుంటోంది.. అది రాష్ట్రం పాలిట శాపంగా మారుతోంది.

‘చంద్రబాబు హయాంలోనే కాస్త బెటర్‌.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విద్యా సంస్థనో, ఇంకొకటో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది..’ అన్న భావన ప్రజల్లో పెరుగుతోందంటే, అది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి వస్తుంది. ఇక, ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏకంగా నిరాహార దీక్షలే చేశారు. ఇప్పుడు ఆ తరహా దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. తమ ఎంపీలతో ఢిల్లీలో నిరసనలు, నినాదాలు చేయిస్తే సరిపోతుంది. కానీ, ఆ దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కనీసపాటి కార్యక్రమాలు కూడా చేయకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

కేంద్రం కాదు, ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీలే పాతరేసేశాయ్‌.. అందులో టీడీపీ, వైసీపీ.. దొందూ దొందే.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...