గత సంవత్సరం ఏపీ ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జి కనగరాజ్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగిన ఆయన్ను అగౌరవంగా తప్పించాల్సి వచ్చింది. ఆ విషయంలో జగన్ ఆయనకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో మళ్లీ ఆయనకు అరుదైన గౌరవ ప్రథమైన పోస్ట్ ను క్రియేట్ చేసి మరీ అప్పగించబోతున్నారు. ఏపీలో పోలీసులపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిని పరిష్కరించేందుకు విచారించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీ చైర్మన్ గా కనగరాజ్ ను నియమిస్తున్నారు.
పోలీసుల నుండి ప్రజలకు న్యాయం జరగాలి. కాని న్యాయం జరుగక పోగా అన్యాయం జరుగుతుందని అప్పుడప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. కనుక అలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు కనగరాజ్ కమిటీ ఎంక్వౌరీ నిర్వహిస్తుంది. తమకు అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు చర్యలు తీసుకోవడం ఈ కమిటీ విధులు. ఇలాంటి ఒక కమిటీ దేశంలోనే చాలా అరుదుగా ఉందని ఏపీ నాయకులు అంటున్నారు.
511143 86047Thanks for the weblog loaded with so a lot of data. Stopping by your blog helped me to get what I was searching for. 482729