Switch to English

బటన్లు.. బకాయిలు.! రాష్ట్రంపై జగన్ మోపిన ‘అప్పుల’ భారమిదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

దేశ రాజకీయ చరిత్రలో ‘బటన్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరే.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అప్పులు చేయడం, ఆ వెంటనే బటన్లు నొక్కడం.. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసింది.

బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రే ఎందుకు.? అన్న ప్రశ్నకి వైసీపీ శ్రేణుల దగ్గర ఇప్పటికీ సమాధానం వుండదు. ఈ బటన్లు నొక్కే కార్యక్రమాల పేరుతో, రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకే పరిమితమయ్యేవారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ, ఇన్ని బటన్లు నొక్కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిందేంటి.? 151 నుంచి 11కి పడిపోవడం.!

జగన్ ‘అద్భుత’ పాలన తర్వాత, రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు మిగిలింది. పది లక్షల కోట్ల రూపాయల అప్పుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసేసి, రాష్ట్రం నెత్తిన పెను భారం మోపారన్న విమర్శలు టీడీపీ నుంచి, జనసేన అలాగే బీజేపీ నుంచీ అప్పట్లోనే వచ్చాయి. ఆ లెక్కలు ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.

అన్ని లక్షల కోట్లు అప్పు చేసి, బటన్లు నొక్కి.. ఆపై బకాయిలు కూడా మిగిల్చేశారు వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నిటికీ వందల కోట్లు, వేల కోట్లలో బకాయిలున్నాయ్.. జగన్ ప్రభుత్వం కుప్ప కూలేసరికి.

కూటమి ప్రభుత్వానికి ఇదే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అప్పులకుగాను, కట్టాల్సిన వడ్డీలే సుమారు 70 వేల కోట్ల రూపాయల దాకా వుంటోందంటే, చిన్న విషయం కాదు కదా.! రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచాం.. అని బటన్ నొక్కుడు వ్యవహారం గురించి చెప్పుకున్నారు జగన్. కానీ, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయ్.

చిత్రమేంటంటే, సాక్షికి ఇచ్చుకున్న ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి బకాయిల్లేవ్. వైసీపీ హయాంలో కుప్పలు తెప్పలుగా నియమించుకున్న సలహాదారులకు కూడా బకాయిల్లేవ్. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం పెద్దయెత్తున పోగుపడి వున్నాయ్.

ఇవే కాదు, వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి, ఇతర కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకుండా ఆపేయడంతో, ఆ బకాయిలూ రాష్ట్ర ఖజానాకి భారంగా మాారాయి. మొత్తంగా చూస్తే, లక్షా నలభై వేల కోట్ల రూపాయల బకాయిల్ని జగన్ సర్కారు మిగిల్చిపోయినట్లు తెలుస్తోంది.

జగనన్న షిక్కీలు, కోడిగుడ్లకు సంబంధించి కూడా దాదాపు 250 కోట్ల రూపాయల బకాయిలున్నాయంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకంగా 2200 కోట్లు కాగా, ఉద్యోగులకు 22 వేల కోట్ల బకాయిల్ని పెట్టింది అప్పటి జగన్ సర్కార్. ఉపాధి హామీ బకాయిలు, ఇరిగేషన్ శాఖ బకాయిలు.. ఇవన్నీ వేల కోట్ల వ్యవహారాలే.

తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయం కోసం, విశాఖలో జగన్ కోసం నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్ భవనాల కోసం.. చెప్పుకుంటూ పోతే, వృధా ఖర్చు అంచనాలకు అందని రీతిలో వుంది. ఇలాంటి అర్థం పర్థం లేని వ్యవహారాల కోసం కీలకమైన నిధుల్ని వృధా చేసి, ముఖ్యమైన కార్యక్రమాలకు చెల్లింపులు చేయకుండా, బకాయిలు మిగిల్చిన జగన్, రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు.. అంచనాలకు అందనిది.

70 వేల కోట్లకు పైగా వడ్డీలకే చెల్లిస్తూ కూడా, అధికారంలోకి వస్తూనే సామాజిక పెన్షన్లు పెంచడం సహా, ఎన్నికల హామీలన్నిటినీ నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది కూటమి సర్కార్. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకు రానుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం.

సినిమా

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

రాజకీయం

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

ఎక్కువ చదివినవి

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్ మెటీరియల్ అయినా సరే అమ్మడికి ఎందుకో...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. 11 మందిపై కేసు నమోదు..!

ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ట్రై చేస్తూ లాభ పడటం సంగతి అటుంచితే దాని కోసం భారీ మొత్తంలో అప్పుచేసి ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...